‘బెంగాల్లో భాజపా ఓటమికి కారణం వారే’
పశ్చిమ బెంగాల్లో జరిగిన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓటమిపై ఆ పార్టీ కీలక నేత, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నాయకుల అతితెలివి, అతివిశ్వాసం వల్లే పార్టీ ఓటమిపాలైందని ఆయన వ్యాఖ్యానించారు.....
పార్టీ కీలక నేత సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో జరిగిన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓటమిపై ఆ పార్టీ కీలక నేత, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నాయకుల అతితెలివి, అతివిశ్వాసం వల్లే పార్టీ ఓటమిపాలైందని ఆయన వ్యాఖ్యానించారు. పూర్వ మేదినీపూర్ జిల్లాలోని చందీపూర్ ప్రాంతంలో ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘తొలి రెండు విడతల పోలింగ్లో భాజపాకు భారీ మద్దతు లభించింది. దీంతో మన నేతలు కొంతమంది అతివిశ్వాసం, అతి తెలివి ప్రదర్శించారు. భాజపా 170-180 సీట్లు గెలుచుకుంటుందని నమ్మడం ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో పని చేయడంపై నిర్లక్ష్యం వహించారు. అందువల్లే మనం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది’’ అని సువేందు వ్యాఖ్యానించారు.
సువేందు అధికారి వ్యాఖ్యలపై అధికార తృణమూల్ స్పందించింది. భాజపా ఓటమికి సువేందు ఇతరుల్ని ఎందుకు బాధ్యుల్ని చేస్తున్నారని తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ప్రశ్నించారు. సువేందు సైతం తమ పార్టీ 200 సీట్లకు పైగా గెలుచుకుంటోందని కలల్లో విహరించలేదా?అని ఎద్దేవా చేశారు. అలాగే ప్రజలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన అభివృద్ధిని చూసే ఓటేశారన్నారు. ఈ విషయాన్ని భాజపా విస్మరిస్తోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యాంగం మార్పు’పై వ్యాఖ్యలు.. వివాదంలో టీవీ రాముడు
రాజ్యాంగం మార్పుపై ‘రామాయణ్’ సీరియల్ నటుడు, మేరఠ్ భాజపా అభ్యర్థి అరుణ్ గోవిల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. -
ఆ మూడు చోట్ల ఎవరు?.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులపై ఉత్కంఠ
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఇంకా రెండు రోజులే సమయముంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల దాఖలు పర్వం ఆరంభం కానుంది. -
‘బాధ్యులైన పోలీసు అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా?’
‘ఏపీ సీఎం జగన్పై గులకరాయితో దాడి ఘటనలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? ఈ విషయంలో డీజీపీ, నిఘా విభాగం అధిపతి, విజయవాడ పోలీసు కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్రపై విచారణ చేయించాలి. -
‘మేమంతా సిద్ధం’ కాదన్న గుడివాడ!
బస్సులు పెట్టారు. మద్యం తాగించారు. బిర్యానీ పెట్టారు. తలా రూ.300 ఇచ్చారు. కృష్ణా జిల్లాతో పాటు పక్క జిల్లాలకూ బస్సులు పంపి మరీ జనాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. అయినా ‘మేమంతా సిద్ధం’గా లేమంటూ ప్రజలు పెద్దగా స్పందించలేదు. -
రాజీనామా పత్రంపై సంతకాలు చేయండి.. కౌంటర్లు పెట్టి 900 మంది వాలంటీర్ల నుంచి స్వీకరణ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వందల సంఖ్యలో వాలంటీర్లతో రాజీనామాలు చేయించారు. మండపేటలో సోమవారం నియోజకవర్గ వైకాపా అభ్యర్థి తోట త్రిమూర్తులు సమావేశం ఏర్పాటుచేశారు. -
ఆ ‘మాయ’ ఏమైనట్టు?
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్లో రాజకీయాలంటే మాటలు కాదు. అన్ని వర్గాల్లో పట్టు సాధించి అధికారం చేపట్టాలంటే ఎంతో చెమటోడ్చాల్సి ఉంటుంది. -
జగన్ది విధ్వంసం.. కూటమిది నిర్మాణం
‘మొక్కకు నీరు పోసి పెంచితే పెరిగి పెద్దదై మహావృక్షమై ఫలాలు, నీడనిస్తుంది. అన్ని విధాలా ఉపయోగపడుతుంది. మీరు విజ్ఞతతో ఎన్డీయేకు ఓటేస్తే వృథా పోదు. మీ అభివృద్ధి, అభ్యున్నతికి బాటలు వేస్తుంది. -
జగన్ అహంకారం అంతమయ్యే ఎన్నికలివి
సానుభూతి కోసం గత ఎన్నికల్లో కోడి కత్తిని వాడుకున్న సీఎం జగన్ ఈసారి గులకరాయి డ్రామా ఆడుతున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. -
మా నానీ, జోగీ, వంశీ, కిట్టూ.. ఎంతో సౌమ్యులు.. మంచోళ్లు!
‘పెనమలూరు నుంచి జోగి (మంత్రి జోగి రమేష్) నిలబడుతున్నాడు. జోగి నాకు మంచి స్నేహితుడు. మంచివాడు. సౌమ్యుడు. మీ అందరి దీవెనలు, ఆశీస్సులు జోగిపై ఉంచాలని కోరుతున్నా’ అని సీఎం జగన్ అభ్యర్థించారు. -
జగన్పై దాడి ఆత్మల పనే!
సీఎం జగన్ కంటి దెబ్బకు కారణం మనుషులు కాదని, అది ఆత్మల పనేనని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. ‘సీఎంపై దాడికి సంబంధించి సమాచారమిచ్చిన వారికి రూ.2 లక్షల బహుమతి ఇస్తామని విజయవాడ సీపీ కాంతి రాణా ప్రకటించారు. -
తెదేపా ప్రచారంలో పాల్గొన్న ముస్లింలపై వైకాపా కార్యకర్తల దాడి
తెదేపా ప్రచారంలో పాల్గొన్నారని ముగ్గురు ముస్లింలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. -
భాజపా కనుసన్నల్లో పనిచేస్తున్న ఈసీ
భాజపా ఆదేశాలకు లోబడి కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. -
ప్రజల హక్కుల్ని భాజపా లాక్కొంటుంది: ప్రియాంక
ప్రజల హక్కుల్ని లాక్కొనేందుకు అధికార భాజపా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆరోపించారు. -
అమేఠీ ప్రజలు నన్ను కోరుకుంటున్నారు: రాబర్ట్ వాద్రా
అమేఠీ ప్రజలు తన ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నారని, ఇక్కడ తన అభ్యర్థిత్వంపై సరైన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు. -
యువత, సీనియర్ల కలబోత.. బెంగాల్లో పట్టు సాధించేందుకు సీపీఎం ప్రయత్నం
పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. అనేది కార్మిక లోకంలో బాగా ప్రాచుర్యం పొందిన నానుడి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో సీపీఎం పరిస్థితి ఇలాగే ఉంది. -
దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్న మోదీ
భాజపా వద్ద ప్రజల కోసం ఎలాంటి సంక్షేమ ప్రణాళికలు లేవని, ఒకే దేశం, ఒకే అధ్యక్షుడు అంటూ దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రధాని మోదీ యత్నిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ భాజపా సోమవారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. -
ప్రధాని మోదీపై క్రిమినల్ కేసు పెట్టండి
మైసూరు ప్రచారంలో కాంగ్రెస్ను విచ్ఛిన్న ముఠాల సుల్తాన్ (తుక్డే తుక్డే ముఠాల సుల్తాన్ కాంగ్రెస్)గా ప్రధాని మోదీ అభివర్ణించడంపై హస్తం పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. -
యూపీ సీటు కాపాడుకోలేని యువరాజు
కాంగ్రెస్ యువరాజు ఉత్తర్ప్రదేశ్లో తన కుటుంబ స్థానాన్ని (అమేఠీ) కాపాడుకోవడం చేతకాక, కేరళలో కొత్త స్థావరాన్ని ఏర్పరచుకున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. -
అందని ద్రాక్షలు అందిన వేళ!
పార్టీ ఆవిర్భావం నుంచీ అందని ద్రాక్షలుగానే ఊరించినవాటిలో 29 నియోజకవర్గాలను 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఎట్టకేలకు తొలిసారి గెలుచుకుంది. -
ఉత్తరీయం ఎవరికో?
అందమైన హిమాలయ పర్వత ప్రాంతాలకు ఆలవాలమైన ఉత్తరాఖండ్లో లోక్సభ పోరు భాజపా, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
సీనియర్ హీరోయిన్ల జోరు ‘తగ్గేదే లే’.. ఎవరెన్ని సినిమాలతో బిజీగా ఉన్నారంటే?
-
‘మరో ఆటగాడిని తీసుకోవాలని చెప్పా..’- ఐపీఎల్ నుంచి మ్యాక్స్వెల్ బ్రేక్
-
శిరోముండనం కేసుపై నేడు విశాఖ కోర్టు తీర్పు.. ఉత్కంఠ
-
ఎన్నికల కోడ్ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమట!
-
ఠారెత్తిస్తోన్న ఎండలు.. ఏం చేయాలి? ఏం చేయొద్దు?
-
జీలం నదిలో పడవ బోల్తా.. పలువురి గల్లంతు