Raghu nandan: ఐఆర్‌బీ డెవలపర్స్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే హత్యలు చేస్తున్నారు: రఘునందన్‌

ఐఆర్‌బీ డెవలపర్స్‌ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే హత్యలు చేస్తున్నారని దుబ్బాక భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు.

Published : 25 May 2023 17:16 IST

హైదరాబాద్‌: ఐఆర్‌బీ డెవలపర్స్‌ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే హత్యలు చేస్తున్నారని దుబ్బాక భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఓఆర్‌ఆర్‌ టోల్‌గేట్‌ విషయంలో సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ధ్వజమెత్తారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓఆర్‌ఆర్‌ టోల్‌గేట్‌ విషయంలో సీబీఐకి ఫిర్యాదు చేశామని, ఈవిషయంలో సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఓఆర్‌ఆర్‌ టోల్‌గేట్‌ అంశంపై భాజపా చాలా రోజులుగా ప్రశ్నిస్తోందన్నారు. ఓఆర్‌ఆర్‌ అంశంపై భాజపా ఎందుకు ప్రశ్నించడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారని, తమకెవరూ సుద్దులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రూ.7,200 నుంచి రూ.7,380 కోట్లకు ఓఆర్‌ఆర్‌ టెండర్‌ విలువ పెంచిందెవరని మండిపడ్డారు. దీనిపై సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నేర చరిత్ర కలిగిన ఐఆర్‌బీకి ఇచ్చిన టెండర్‌ రద్దు చేయాలన్నారు. వేసవి సెలవుల తర్వాత దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ టెండర్ అని చెప్పి.. నిబంధనలు ఎందుకు మార్చారని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని