రత్నప్రభ గెలిస్తే కేంద్రమంత్రి: రఘునందన్‌

దుబ్బాక ఫలితం తిరుపతి పార్లమెంట్‌ ఎన్నికల్లో పునరావృతం అవుతుందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన మేధావుల..

Published : 05 Apr 2021 01:11 IST

నాయుడుపేట: దుబ్బాక ఫలితం తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో పునరావృతం అవుతుందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన మేధావుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఏపీకి ప్రత్యేకహోదా కొన్ని సాంకేతిక కారణాలతో ఆగిందన్నారు. తిరుపతి ఉపఎన్నికలో తమ అభ్యర్థి రత్నప్రభను గెలిపిస్తే కేంద్రమంత్రిని చేస్తామని ప్రకటించారు. ఒక్క సీటు గెలిచినా ఏపీ రూపురేఖలు మారుస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని