MLA Sit-Ups: నన్ను క్షమించండి.. గుంజీలు తీసిన ఎమ్మెల్యే..!
ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని మద్దతుదారులను క్షమించమని కోరుతూ ఏకంగా గుంజీలు తీసిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది.
యూపీ ఎన్నికల ప్రచారంలో ఘటన
సోన్భద్ర (యూపీ): ఉత్తర్ప్రదేశ్లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం రాజకీయ పార్టీలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. గతంలో చేసిన అభివృద్ధి పనులు, కొత్త హామీలతో ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని మద్దతుదారులను క్షమించమని కోరుతూ ఏకంగా గుంజీలు తీయడం విశేషం. యూపీలోని సోన్భద్రలో తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఉత్తర్ప్రదేశ్లోని సోన్భద్రకు చెందిన భూపేష్ చౌబే రాబర్ట్స్గంజ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ఎన్నికల్లోనూ పోటీలో ఉన్న ఆయన.. తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నాడు. తాజాగా బూత్స్థాయి కార్యకర్తలు, బూత్ ఇంఛార్జీలు, ఏజెంట్లు, మద్దతుదారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కార్యకర్తలను ఉద్దేశిస్తూ ప్రసంగించిన చౌబే, మరోసారి తనకు ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం కల్పించాలని కోరాడు. అంతేకాకుండా గత ఐదేళ్లలో తాను ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని కోరుతూ గుంజీలు తీశాడు. ‘నన్ను క్షమించమని మీకు చేతులు జోడించి వేడుకుంటున్నా..’ అంటూ గుంజీలు తీయడం ప్రారంభించడంతో వేదికపై ఉన్న నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో సమావేశానికి హాజరైన కార్యకర్తలు కూడా అరుపులు, చప్పట్లతో ఆయనకు మద్దతు ప్రకటించారు.
ఇదిలాఉంటే, ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరుగుతున్నాయి. నేటితో (ఫిబ్రవరి 23)తో నాలుగు విడతల పోలింగ్ ముగిసింది. రాబర్ట్స్గంజ్ నియోజకవర్గానికి మార్చి 7న ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా