Telangana News: సభాపతిని కలిసిన భాజపా ఎమ్మెల్యేలు

తెలంగాణ శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన భాజపా ఎమ్మెల్యేలు హైకోర్టు సూచనతో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు.

Updated : 15 Mar 2022 17:15 IST

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన భాజపా ఎమ్మెల్యేలు హైకోర్టు సూచనతో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. తమపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌, రఘునందన్‌రావు స్పీకర్‌ను కోరారు. అంతకముందు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులతో భేటీ అయ్యారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రతిని ఆయనకు అందజేశారు.

అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌పై నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై నిర్ణయం తీసుకునే భారాన్ని హైకోర్టు స్పీకర్‌ చేతుల్లోనే పెట్టింది. రాజ్యాంగ అత్యున్నత హోదాలో ఉన్న స్పీకర్‌కు ఎలాంటి ఆదేశాలివ్వబోమని పేర్కొంది. అయితే సమావేశాలకు మంగళవారం చివరి రోజు కావడంతో స్పీకర్‌ ఒక నిర్ణయం తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని