Gujarat: రీవాబా జడేజా, హార్దిక్ పటేల్కు దక్కిన టికెట్లు.. మోర్బీ అభ్యర్థి గురించి తెలుసా..?
గత నెల చివర్లో గుజరాత్లోని మోర్బీ నగరంలో గల మచ్చు వంతెనపై ఉన్న తీగల వంతెన ప్రమాదవశాత్తూ కూలిపోవడంతో సుమారు 140 మంది మృతి చెందారు. ఎన్నికల వేళ జరిగిన ఈ దుర్ఘటన.. అక్కడ అధికారంలో ఉన్న భాజపాను ఇరకాటంలోకి నెట్టేసింది.
గాంధీనగర్: ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. డిసెంబర్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. 160 నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భాజపా గురువారం విడుదల చేసింది. ఇటీవల మోర్బీ ఘటనతో ఇరకాటంలో పడిన కమలం పార్టీ అక్కడ నిలబెట్టిన అభ్యర్థి వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అలాగే టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రీవాబా జడేజా, కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన హార్దిక్ పటేల్కు టికెట్లు దక్కాయి.
గత నెల చివర్లో గుజరాత్లోని మోర్బీ నగరంలో గల మచ్చు నదిపై ఉన్న తీగల వంతెన కూలిపోవడంతో సుమారు 140 మంది మృతి చెందారు. ఎన్నికల వేళ జరిగిన ఈ దుర్ఘటన.. అక్కడ అధికారంలో ఉన్న భాజపాను ఇరకాటంలోకి నెట్టింది. దాంతో ఆ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక విషయంలో కమలం పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. ఈ ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్ అమృతియా(60)ను బరిలోకి దింపింది. ఆయన తీగలవంతెన దుర్ఘటన సమయంలో నదిలో దూకి పలువురి ప్రాణాలు కాపాడినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన వీడియోల్లో.. ఆయన లైఫ్ ట్యూబ్ ధరించి నదిలో పడిపోయిన వారిని రక్షిస్తున్నట్లు కన్పించింది. భాజపా అభ్యర్థుల జాబితాలో తొలుత కాంతిలాల్ పేరు లేనప్పటికీ, నదిలోకి దూకి ఆయన చేసిన సాహసమే టికెట్ దక్కేందుకు కారణమైందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే బ్రిజేశ్ మెర్జాకు నిరాశ ఎదురైంది.
ఇక ముందుగా వార్తలు వచ్చినట్లుగానే రీవాబా జడేజాకు టికెట్ దక్కింది. ఆమె జామ్నగర్ నార్త్ నుంచి పోటీ చేయనున్నారు. పాటీదారీ ఉద్యమంతో గుజరాత్ రాజకీయాల్లో కీలకంగా మారిన హార్దిక్ పటేల్ను వీరమ్గామ్ నుంచి బరిలో నిలిపింది. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. ఘాట్లోడియా నుంచి పోటీ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్