Congress: దేశం పేదరికంలో ఉంటే భాజపా ఆస్తులు 550% పెరిగాయ్..!
ఓ వైపు పేద, మధ్యతరగతి ప్రజలు మరింత పెదరికంలో మగ్గిపోతుంటే భారతీయ జనతా పార్టీ ఆస్తులు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది
కాషాయ పార్టీపై కాంగ్రెస్ ధ్వజం
దిల్లీ: ఓ వైపు పేద, మధ్యతరగతి ప్రజలు మరింత పెదరికంలో మగ్గిపోతుంటే భారతీయ జనతా పార్టీ (BJP) ఆస్తులు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress) పార్టీ దుయ్యబట్టింది. దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆస్తుల వివరాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) శుక్రవారం నివేదిక విడుదల చేసింది. మొత్తం 51 పార్టీల ఆస్తులన్నింటిని కలిపి లెక్కిస్తే రూ.9,117.95 కోట్లు ఉండగా.. ఇందులో ఒక్క భాజపా ఆస్తులే రూ.4,847.78 కోట్లు (53.16%)గా ఉన్నాయి.
దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. కాషాయపార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘ 2013-14లో భాజపా ఆస్తులు రూ.780 కోట్లు. 2019-20 నాటికి కాషాయ పార్టీ ఆస్తుల విలువ రూ.4,847 కోట్లు. దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలు మరింత పేదరికంలోకి వెళ్తుంటే.. కేవలం భాజపా ఆస్తులు మాత్రం 550శాతం పెరిగాయి. నవ భారతానికి ‘మోదీ మోడల్’ అంటే ఇదేనేమో..! దేశం నిజంగా మారుతోంది’’ అని సుర్జేవాలా దుయ్యబ్టటారు.
2019-20 సంవత్సరానికి సంబంధించి దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల లెక్కలకు సంబంధించిన వివరాలపై ఏడీఆర్ నిన్న నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా భాజపా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత రూ. 689.33 కోట్లతో బీఎస్పీ రెండో స్థానంలో ఉండగా.. కాంగ్రెస్ ఆస్తులు రూ. 588.16కోట్లుగా ఉన్నాయి. ఇక అప్పుల్లో హస్తం పార్టీ మొదటి స్థానంలో ఉంది. ఈ పార్టీకి రూ.49.55కోట్ల రుణాలు ఉండగా.. రూ.30.342 కోట్ల అప్పులతో తెదేపా రెండోస్థానంలో ఉంది. తెరాసకు రూ.4.41 కోట్లు అప్పులు ఉండగా.. వైకాపా అప్పులను నివేదికలో పొందుపర్చలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!