Madhya Pradesh Elections: ‘మామ’ మనసులో కుర్చీ టెన్షన్.. అసెంబ్లీ సీటుపై సస్పెన్స్!
మధ్యప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి భాజపా విడుదల చేసిన రెండు జాబితాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు లేకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
ఇంటర్నెట్డెస్క్: మధ్యప్రదేశ్లో ఎన్నికల (Madhya Pradesh Elections) వేడి రాజుకుంటోంది. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ను దీటుగా ఎదుర్కొనేందుకు భాజపా (BJP) తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రెండు విడతల్లో ఇప్పటికే 78 మంది అభ్యర్థులను ప్రకటించింది. జాతీయ స్థాయి నాయకులను కూడా రంగంలోకి దించుతోంది. ముగ్గురు కేంద్ర మంత్రులకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించిందంటే వ్యూహాన్ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు జాబితాల్లోనూ ముఖ్యమంత్రి, అందరూ ముద్దుగా ‘మామ’ అని పిలుచుకునే శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రాబోయే ఎన్నికలకు ఆయన దూరంగా ఉంటారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత?
ఇది హెచ్చరికేనా?
ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ సుదీర్ఘ కాలంపాటు సేవలందించారు. రాజకీయంగా అపార అనుభవం ఉంది. అలాంటి వ్యక్తి పేరు తొలి రెండు జాబితాల్లో లేకపోవడం కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. దీనికి తోడు కేంద్రమంత్రులను బరిలోకి దించడం, చౌహాన్ రాజకీయ భవిష్యత్పై ప్రశ్నలు సంధిస్తోంది. భాజపా అధిష్ఠానం తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు చౌహాన్కు హెచ్చరికగా కొందరు భావిస్తున్నారు. ఒకవేళ త్వరలో విడుదల చేయబోయే అభ్యర్థుల జాబితాల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు ఉన్నా.. ఆయన ముఖ్యమంత్రి రేసులో ఉండకపోవచ్చని పార్టీలోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకే కీలక నేతలను బరిలో దించుతున్నట్లు సమాచారం.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ బరిలో కేంద్రమంత్రులు, ఎంపీలు.. 39మందితో భాజపా రెండో జాబితా!
భాజపా వ్యూహమే!
పార్టీలోని మరికొన్ని వర్గాలు మాత్రం శివరాజ్ సింగ్ చౌహాన్ను టికెట్ కేటాయించబోరన్న వాదనను ఖండిస్తున్నాయి. కాంగ్రెస్ను ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే జాతీయ స్థాయి నాయకులను భాజపా అసెంబ్లీ బరిలో దించుతోందని చెబుతున్నారు. భాజపా తాజాగా విడుదల చేసిన జాబితాలో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, ఫగ్గన్సింగ్ కులస్థేల పేర్లను ఖరారు చేసింది. ఇప్పటి వరకు విడుదల చేసిన జాబితాలో ఒక్క సిట్టింగ్ మంత్రి పేరు కూడా లేకపోవడం గమనార్హం. అభ్యర్థుల విషయంలో బంధుప్రీతిని అరికట్టాలన్న ఉద్దేశంతోనే భాజపా అధిష్ఠానం ఈ తరహా చర్యలు తీసుకుంటోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ హైకమాండ్ ఎదుట ప్రజల్లో తమకున్న బలాన్ని నిరూపించిన వారికే టిక్కెట్లు కేటాయించాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం.
‘ఇండియా’ను ఎదుర్కొనేందుకే!
కేంద్రంలో భాజపాను గద్దె దించేందుకు ఏర్పాటైన ‘ఇండియా’ కూటమి.. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సత్తా ఉన్న నాయకులను ఏరికోరి మరీ అధిష్ఠానం బరిలోకి దించుతోంది. ఇదే వ్యూహాన్ని త్వరలో ఎన్నికలు జరగనున్న బెంగాల్, పంజాబ్, కేరళలోనూ అమలు చేసే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా.. అభ్యర్థుల విషయంలో అచితూచి అడుగులు వేస్తోంది. మధ్యప్రదేశ్లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత నెలలోనే 39మందితో తొలి జాబితాను ప్రకటించిన భాజపా అధిష్ఠానం.. మంగళవారం మరో 39 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
భాజపా ఓటమిని అంగీకరించినట్టే: కాంగ్రెస్
మధ్యప్రదేశ్ ఎన్నికల బరిలో భాజపా కేంద్ర మంత్రుల్ని దించుతుండటంపై ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందించింది. కమలం పార్టీ ఓటమిని అంగీకరించిందని వ్యాఖ్యానించింది. ఓడిపోతామన్న భయంతోనే జాతీయస్థాయి నాయకుల్ని ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెడుతోందని విమర్శించింది. 2018 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ .. కమల్నాథ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్టీలో ఏర్పడిన అంతర్గత విభేదాల కారణంగా సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియాతోపాటు 24 మంది ఎమ్మెల్యేలు భాజపా గూటికి చేరిపోయారు. దీంతో 2020లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని పొందాలని కాంగ్రెస్, అధికారాన్ని నిలబెట్టుకోవాలని భాజపా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయంగా ఇరువర్గాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Chandrababu: రైతుల కష్టాలు జగన్కు ఏం తెలుసు?: చంద్రబాబు
జగన్కు.. ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియదని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రికి రైతుల కష్టాలెలా తెలుస్తాయని ప్రశ్నించారు. -
TS Assembly: శనివారం ఉదయం కొలువుదీరనున్న తెలంగాణ శాసనసభ
తెలంగాణ 3వ శాసనసభ శనివారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. -
Lok Sabha: మరో ఇద్దరు భాజపా ఎంపీల రాజీనామాలు ఆమోదం
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన భాజపా ఎంపీలు తమ సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. -
Revanth Reddy: అంతకుమించిన తృప్తి ఏముంటుంది!: సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) నేడు ‘ప్రజాదర్బార్’ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రజా దర్బార్ జరిగిన తీరుపై సీఎం ఆసక్తికర ట్వీట్ చేశారు. -
ChandraBabu: ప్రతిపక్షాల ఓట్లను అధికార పార్టీ తొలగిస్తోంది: ఈసీకి చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ.. ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు (ChandraBabu) అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆయన లేఖ రాశారు. -
Revanth Reddy: దిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేతలతో ఆయన సమావేశం కానున్నారు. -
BJP: కొత్త సీఎంలపై ఇంకా వీడని ఉత్కంఠ.. కమిటీలు వేసిన భాజపా
మూడు రాష్ట్రాల్లో విజయం సాధించి ఐదురోజులైనా.. భాజపా(BJP) ఇంకా ముఖ్యమంత్రులను ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఈ ఎంపిక ప్రక్రియను కమలం పార్టీ ముమ్మరం చేసింది. -
ChandraBabu: వైకాపా ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే 3 నెలల తర్వాత నేనిస్తా: చంద్రబాబు
తాను ఏ తప్పూ చేయకున్నా జైల్లో పెట్టి క్షోభకు గురి చేశారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెనాలి నియోజకవర్గం నందివెలుగులో తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. -
TS Assembly: శాసనసభ ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఒవైసీ
తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్తో రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు. -
Pawan Kalyan: కేసీఆర్కు గాయమైందని తెలిసి బాధపడ్డా: పవన్కల్యాణ్
భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR)కు గాయమైందని తెలిసి బాధపడ్డానని జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. -
Chandrababu: నా పర్యటన ఖరారైతే తప్ప జగన్లో కదలిక రాలేదు: చంద్రబాబు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటనకు వెళ్తున్నానని.. అందుకే ఇప్పుడు సీఎం జగన్ హడావుడిగా బయల్దేరారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
Daggubati Purandeswari: ఏపీ మంత్రులెవరూ రైతులను పరామర్శించిన దాఖలాల్లేవు: పురందేశ్వరి
తుపాను కారణంగా రాష్ట్రంలో పంటలు బాగా దెబ్బతిన్నాయని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. -
Revanth Reddy: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలి: అధికారులకు సీఎం ఆదేశం
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు గాయమైన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై సీఎం రేవంత్రెడ్డి ఆరా తీశారు. -
Anam Venkata Ramana Reddy: కుంభకోణం జరగలేదని తితిదే ఛైర్మన్ ప్రమాణం చేయగలరా?: ఆనం
ఆంధ్రప్రదేశ్లో ₹వేల కోట్ల అభివృద్ధి హక్కు పత్రాల(టీడీఆర్ బాండ్లు) కుంభకోణం జరిగిందని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) ఆరోపించారు. -
Kavitha: అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారు: ఎమ్మెల్సీ కవిత
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆరోగ్యంపై ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) స్పందించారు. -
ఏళ్లుగా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు వచ్చారా..?
గుంటూరు జిల్లా కాకుమానులో తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వెళ్లిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు నిరసన సెగ తగిలింది. -
వైకాపా దుష్టపాలన ఇంకా మూడు నెలలే
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే తెదేపా-జనసేన పొత్తు తప్పనిసరి. అందుకే మా పొత్తును గెలిపించండి. మళ్లీ వైకాపా వైపు చూశారా? మీ భవిష్యత్ను మీరు నాశనం చేసుకున్నట్లే. -
అసమర్థ ప్రభుత్వమిది.. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శ
జగన్ ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రం అన్ని రకాలుగానూ నష్టపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. -
సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి: ఎమ్మెల్సీ కె.కవిత
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని తెబొగకాసం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కె.కవిత పిలుపునిచ్చారు. -
మమతపై కేంద్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. -
నెహ్రూను అవమానిస్తే పటేల్ను దూషించినట్టే
‘‘భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఉప ప్రధాని సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ ఒకే నాణేనికి రెండు వైపుల వంటివారు.


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: కృత్రిమ మేధా రంగంలో ముందడుగుకు యత్నాలు..: మోదీ
-
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా
-
వాట్సప్లో ఇకపై వాయిస్ మెసేజ్లకు ‘వ్యూ వన్స్’.. త్వరలో ఈ ఫీచర్ కూడా..
-
IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లు.. అప్పుడు హీరోలు వీరే!
-
NTR: నెట్ఫ్లిక్స్ కో-సీఈవోకు ఎన్టీఆర్ ఆతిథ్యం.. ఫొటోలు వైరల్
-
ఐటీ సోదాల్లో ₹220 కోట్లు స్వాధీనం.. ప్రతి పైసా వెనక్కి రప్పిస్తామన్న మోదీ