AP News: ఏపీ ప్రభుత్వానిది ఉదాసీన వైఖరి: సోము

క‌రోనా రెండో ద‌శ వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌డంలో ప్ర‌భుత్వం ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించింద‌ని

Published : 24 May 2021 01:53 IST

అమ‌రావ‌తి: క‌రోనా రెండో ద‌శ వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ఏపీ భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు విమ‌ర్శించారు. నేడు రాష్ట్ర‌వ్యాప్తంగా ఆ పార్టీ నేత‌లు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. క‌డ‌ప‌లో ఆ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. కొవిడ్ క‌ట్ట‌డికి బ‌డ్జెట్‌లో స‌రిప‌డా నిధులు కేటాయించ‌క‌పోవ‌డాన్ని సోము వీర్రాజు తప్పుబట్టారు. అఖిలప‌క్ష సమావేశం ఏర్పాటు చేసి క‌రోనా క‌ట్ట‌డికి సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని