పరకాల ఎమ్మెల్యే ఇంటిపై దాడి
అయోధ్య రామాలయ నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై భాజపా నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. హన్మకొండ నక్కలగుట్టలోని ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడికి దిగారు.
వరంగల్ (క్రైం): అయోధ్య రామాలయ నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై భాజపా నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. హన్మకొండ నక్కలగుట్టలోని ఆయన ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల భాజపా నేతలు, కార్యకర్తలు ఉన్నారు. రాళ్ల దాడితో ఎమ్మెల్యే ఇంట్లోని అద్దాలు, కుర్చీలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చి భాజపా నాయకులను అరెస్టు చేశారు. అనంతరం వారిని సుబేదారి ఠాణాకు తరలించారు.
తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు: ఎర్రబెల్లి
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై భాజపా శ్రేణులు దాడి చేయడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి గురైన ధర్మారెడ్డి ఇంటిని మంత్రి దయాకర్రావుతో పాటు ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి పరిశీలించారు. భాజపా శ్రేణులు తీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దయాకర్రావు హెచ్చరించారు.
భాజపా శ్రేణులు దౌర్జన్యానికి దిగితే మీము కూడా దిగవలసి వస్తుందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. రామాలయం అందరికీ కావల్సిందేనని, మీము కూడా విరాళాలు ఇస్తున్నామన్నారు. ధర్మారెడ్డి లెక్కలు చెప్పమనడం తప్పా అని ప్రశ్నించారు. గుండాగిరి, దాదాగిరి చేస్తే సహించేది లేదన్నారు. ఇలాంటి దౌర్జన్యం మీరు ఆపకపోతే మా కార్యకర్తలు తీవ్రమైన చర్యలు తీసుకుంటారన్నారు. మరోవైపు ఈ దాడిని ఖండిస్తూ పరకాలలో తెరాస శ్రేణులు ధర్నా చేశాయి.
తెరాస కార్యకర్తల ఓపిక నశిస్తే మీరు బయట తిరగలేరు: కేటీఆర్
ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై దాడిని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో తమ వాదనతో ప్రజల్ని ఒప్పించలేక ఇతర పార్టీలపై భాజపా చేస్తున్న భౌతిక దాడులను అందరూ ఖండించాలని కేటీఆర్ కోరారు. విలువలతో కూడుకుంటున్న రాజకీయాలను తెరాస కోరుకుంటోందన్నారు. తమ ఓపికకు ఓ హద్దు ఉందన్న కేటీఆర్.. బాధ్యతాయుతమైన పార్టీగా సంయమనంతో ఉంటున్నామన్నారు. తెరాస కార్యకర్తల ఓపిక నశిస్తే బయట తిరిగలేరని ఆయన భాజపాను హెచ్చరించారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలిదశకు ముగిసిన ప్రచారం
సార్వత్రిక సమరం అసలుసిసలు ఘట్టంలోకి ప్రవేశించింది. ఏడు విడతలకు విస్తరించిన ఎన్నికల్లో తొలిదశ కింద 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. -
రాష్ట్ర అంశాలే ఎజెండా
రాజస్థాన్లో భాజపా హవాను అడ్డుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. క్లీన్స్వీప్ చేయకుండా కొన్ని సీట్లైనా దక్కించుకోవాలని పోరాడుతోంది. -
గ్యారంటీగా వచ్చేది మేమే
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో గ్యారంటీగా అధికారంలోకి వచ్చేది తామేనని ప్రధాని మోదీ మరోసారి ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అస్సాంలోని నలబాడీలో, త్రిపుర రాజధాని అగర్తలలో బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. -
ప్రధాని మోదీ అవినీతి ఛాంపియన్
దేశంలో ఎన్నికల బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. -
సంక్షిప్త వార్తలు
దేశంలోని అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తామని సీపీఎం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం వెనకున్న ఉద్దేశమేమిటి? -
తొలి విడతలో కీలకం!
సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. శుక్రవారం 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో కొన్ని నియోజకవర్గాలు పార్టీలకు, నేతలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. -
అనంత్నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు: డీపీఏపీ
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధ్యక్షుడు గులాంనబీ ఆజాద్.. అనంత్నాగ్-రాజౌరి సీటు నుంచి పోటీ చేయట్లేదని ఆ పార్టీ ప్రకటించింది. -
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోదీ లేఖ
లోక్సభ ఎన్నికల తొలి విడత బరిలో ఉన్న ఎన్డీయే అభ్యర్థులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడివిడిగా లేఖలు రాశారు. -
పేదలకు ఉచితంగా 10 గ్యాస్ సిలిండర్లు
కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి ఏటా 10 గ్యాస్ సిలిండర్లు, 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని తృణమూల్ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. -
ఐదేళ్లలో ఏం జరిగిందో అవలోకనం చేసుకొని ఓటేద్దాం
ఓటుహక్కు ఉన్న అందరం ఎన్నికల ప్రక్రియలో పాల్గొందామని, ఓటు వేసే ముందు దేశంలో ఐదేళ్లలో ఏం జరిగిందో అవలోకనం చేసుకుని సరైన అభ్యర్థికి, పార్టీకి ఓటు వేద్దామని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బుధవారం అన్నారు. -
బీఎస్పీలోకి మందా జగన్నాథం
మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మందా జగన్నాథం బుధవారం బీఎస్పీ అధినాయకురాలు మాయావతి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. -
గురుకులాలపై సీఎం వివక్ష: భారాస
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ గురుకుల పాఠశాలలపై వివక్ష చూపుతున్నారని భారాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ విమర్శించారు. -
రాష్ట్రంలో భాజపాకు రెండంకెల స్థానాలు ఖాయం: కె.లక్ష్మణ్
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో భాజపాకు రెండంకెల స్థానాలు ఖాయమని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
కేసీఆర్దే లిల్లీపుట్ మనస్తత్వం: మల్లు రవి
అప్పుడప్పుడు లిల్లీపుట్లకు కూడా అధికారం వస్తుందని మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. -
పార్లమెంటు నియోజకవర్గాలకు కిసాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జుల నియామకం
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్రంలో సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి మినహా మిగతా 14 పార్లమెంటు నియోజకవర్గాలకు జోనల్, నియోజకవర్గ ఇన్ఛార్జులను నియమించింది. -
19, 24 తేదీల్లో ఉమ్మడి వరంగల్లో సీఎం ఎన్నికల ప్రచారం
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 19, 24 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. -
ప్రభుత్వాన్ని టచ్ చేస్తే.. తెలంగాణభవన్ పునాదులు లేకుండా చేస్తాం
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనే భావనతో.. పార్టీని టచ్ చేయాలని చూస్తే హైదరాబాద్లో భారాస కార్యాలయం తెలంగాణభవన్ పునాదులు లేకుండా చేస్తామని రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హెచ్చరించారు. -
ప్రజలకు తాగునీరైనా ఇవ్వండి
పంటలకు సాగునీళ్లు ఎలాగూ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలకు కనీసం గొంతు తడుపుకోవడానికి మంచినీళ్లయినా ఇవ్వాలని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
సార్వత్రిక సవాల్..
సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది. -
బ్యాలెట్తో ఎన్నికలంటే భాజపాకు భయమెందుకు?
ప్రపంచవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని, మనదేశంలో బ్యాలెట్ ఎన్నికలంటే భాజపాకు, ప్రధాని మోదీకి భయమెందుకని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!