Telangana News: ఆపరేషన్‌ ఆకర్ష్‌.. భాజపాలో ఈటలకు కొత్త బాధ్యతలు!

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ (భాజపా) వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వేగవంతం చేయాలని కమలనాథులు

Updated : 04 Jul 2022 21:02 IST

హైదరాబాద్‌: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ (భాజపా) వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వేగవంతం చేయాలని కమలనాథులు నిర్ణయించారు. ఈ బాధ్యతలను ముఖ్యమైన నేతలకు అప్పగించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ప్రస్తుతం పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఇంద్రసేనా రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ఆయన ఇప్పటికే కోరినట్లు సమాచారం. ఆ స్థానంలో చేరికల కమిటీ బాధ్యతలను కొత్తగా పార్టీలో చేరిన మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు, కో-ఛైర్మన్‌గా వివేక్ వెంకటస్వామికి అప్పగించాలనే యోచనలో భాజపా నేతలు ఉన్నట్లు సమాచారం.

తెరాస ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడంతో పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈటలకు ఈ బాధ్యతలు అప్పగిస్తే.. పార్టీలో చేరికలు ఎక్కువగా ఉంటాయని భాజపా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భాజపా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం బండి సంజయ్‌ అధ్యక్షతన పార్టీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌ల భేటీ జరగనుంది. పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప సభపై మొత్తం 119 నియోజకవర్గాల్లో జరిగిన సంపర్క్‌ యోజనపై ఇందులో సమీక్షించనున్నారు. అలాగే పార్లమెంటు ప్రవాస్‌ యోజన తయారీపై చర్చతో పాటు భవిష్యత్‌ కార్యక్రమాలపై కసరత్తు చేయనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని