Maharashtra Crisis: శివసేనను భాజపా అంతం చేయాలనుకుంటోంది: ఉద్ధవ్ ఠాక్రే
శివసేనను భాజపా అంతం చేయాలని చూస్తోందని ఉద్ధవ్ ఆరోపించారు....
ముంబయి: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం (Maharashtra Crisis) ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏక్నాథ్ శిందే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన (Shiv Sena) రెబల్ ఎమ్మెల్యే వర్గం (Rebel MLAs) ఇంకా తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాల్సి ఉంది. అప్పటి వరకు ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray).. శిందే వర్గం, భాజపా (BJP)పై శుక్రవారం విరుచుకుపడ్డారు. శివసేనను భాజపా అంతం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేలను మాత్రమే తీసుకెళ్లగలిగారని.. వారిని ఎన్నుకున్న శివసేన (Shiv Sena) మద్దతుదారులను మాత్రం ప్రలోభపెట్టలేరని వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి ఆయన పార్టీకి చెందిన కార్పొరేటర్లతో వర్చువల్గా మాట్లాడారు.
సామాన్య శివసేన కార్యకర్తలే తమ సంపద అని.. వారు తనతో ఉన్నంత వరకూ తాను ఎలాంటి విమర్శలను పట్టించుకోబోనని ఉద్ధవ్ (Uddhav Thackeray) అన్నారు. సొంత మనుషులే శివసేన (Shiv Sena)కు ద్రోహం తలపెడుతున్నారని వ్యాఖ్యానించారు. పరోక్షంగా గువాహటిలో మకాం వేసిన శిందే వర్గాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీలో చాలా మంది ఎన్నికల్లో టికెట్లు ఆశించారు. అయినా, నేను వీరికి (రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి) కేటాయించాను. మీ కృషి, కష్టం వల్ల గెలిచిన వీరు ఇప్పుడు అసంతృప్తికి గురవుతున్నారు. మీరు మాత్రం ఈ క్లిష్ట సమయంలో పార్టీతో నిలబడ్డారు. మీకు కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు’’ అని కార్పొరేటర్లు, ఇతర నాయకులను ఉద్దేశించి ఉద్ధవ్ అన్నారు.
మహా వికాస్ అఘాడీ కూటమి పక్షాల్లో వస్తున్న ఫిర్యాదులను పరిశీలించాలని ఏక్నాథ్ శిందేకు గతంలో చెప్పానని ఉద్ధవ్ గుర్తుచేసుకున్నారు. ‘‘మెజారిటీ శివసేన ఎమ్మెల్యేలు భాజపాతో చేతులు కలపాలని కోరుతున్నారని శిందే నాతో చెప్పారు. ఆ ఎమ్మెల్యేలను నా దగ్గరకు తీసుకొస్తే చర్చిద్దామని చెప్పాను. భాజపా మమ్మల్ని చాలా దారుణంగా చూసింది. హామీలను నెరవేర్చలేదు. ఈ రెబల్ ఎమ్మెల్యేల్లో చాలా మందిపై కేసులు ఉన్నాయి. ఇప్పుడు వారంతా భాజపాతో వెళితే శుద్ధి అయిపోతారు. ఒకవేళ వారంతా మాతో ఉంటే జైలుకు వెళతారు. ఈ చర్యలు మిత్రుత్వానికి సంకేతమా? ఒకవేళ శివసేన కార్యకర్త ముఖ్యమంత్రి అయితే మీరు భాజపాతో వెళ్లండి. కానీ, ఇప్పుడు మీరు (ఏక్నాథ్ శిందే) మహా అయితే డిప్యూటీ సీఎం అవుతారేమో. ఆ విషయం నాతో చెబితే నేనే మిమ్మల్ని ఉపముఖ్యమంత్రి చేసేవాణ్ని’’ అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.
శివసేన కార్యకర్తలు తనను అసమర్థుడిగా భావిస్తే తాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ఉద్ధవ్ అన్నారు. శివసేన ఒక ఐడియాలజీ అని.. భాజపా హిందుత్వ ఓట్లను ఇంకెవరితోనూ పంచుకోవాలనుకోవట్లేదన్నారు. అందుకే తమ పార్టీని అంతం చేయాలని చూస్తోందన్నారు. హిందుత్వ ఓట్లు చీలొద్దన్న ఉద్దేశంతోనే బాల్ ఠాక్రే గతంలో భాజపాతో పొత్తు పెట్టుకున్నారని గుర్తుచేసుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేలకు భాజపాతో కలవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని అన్నారు. ఒకవేళ వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది ఎంతో కాలం నిలబడదని వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆ వర్గంలో చాలా మంది సంతోషంగా లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో రెబల్ ఎమ్మెల్యేలు కచ్చితంగా గెలవబోరని తెలిపారు. వీలైతే శివసేన ఓటర్లను తీసుకెళ్లండని శిందే, భాజపాకు ఠాక్రే సవాల్ విసిరారు. ఇప్పటికీ పార్టీని వీడాలనుకుంటుకున్నవారు వెళ్లిపోవచ్చన్నారు. తాను కొత్త శివసేనను నిర్మించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు. -
అభ్యర్థుల ఆస్తులు.. అప్పులు.. కేసులు..
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డిపై కేసు
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిపై ఆదిభట్ల పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు నమోదైంది. -
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు: జగ్గారెడ్డి
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు, గ్రాఫిక్ లీడర్స్ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. -
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
‘ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తెదేపా అధిష్ఠానం ఆదేశించింది. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తా. -
అభ్యర్థుల ఆస్తుల వివరాలివీ..
రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా, రెండో రోజు శుక్రవారం వివిధ పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై తిరుగుబాటు
వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి కోటకు బీటలు వారుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఇటీవల ముస్లింలు వైకాపా కార్యాలయాన్ని ముట్టడించగా తాజాగా నేడు మైలవరం మండలానికి చెందిన వైకాపా నాయకులు (ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి వర్గం) తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. -
తంబళ్లపల్లెలో తెదేపా కార్యకర్తలపై లాఠీ ఛార్జ్
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి జయచంద్రారెడ్డి(తెదేపా) నామినేషన్ సందర్భంగా తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. -
వంద మంది వాలంటీర్లు తెదేపాలో చేరిక
భవిష్యత్తులో వైకాపా కనిపించదని.. అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయేనని మాజీ మంత్రి, నెల్లూరు నగర నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పొంగూరు నారాయణ అన్నారు. -
ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి
‘ఓటేసే ముందు కుటుంబంతో కూర్చుని ఒకటికి పదిసార్లు ఆలోచించండి. ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి. -
అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. -
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
విజయవాడ అజిత్సింగ్నగర్లోని తెదేపా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసుల కదలికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. -
వైకాపా పాలనలో శిలాఫలకాలే మిగిలాయి
వైకాపా పాలన శిలాఫలకాలకే పరిమితమైందని.. అభివృద్ధి ఆచూకీ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
వైకాపాను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రాన్ని దోచేస్తారు
రాష్ట్రంలో మాదిగలు బాగు పడాలంటే వైయస్ జగన్ను ఓడించి... ఎన్డీయే కూటమిని గెలిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!