Gujarat polls: గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తాం: అమిత్ షా
వచ్చే నెలలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక(Gujarat Assembly election)ల్లో భాజపా గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah) అన్నారు.
అహ్మదాబాద్: వచ్చే నెలలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక(Gujarat Assembly election)ల్లో భాజపా గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah) అన్నారు. గతంలో ఎప్పుడూ రానన్ని అధికంగా సీట్లు, ఓట్లు సాధించి గుజరాత్లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. సనంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి కనుభాయి పటేల్ నామినేషన్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం భూపేంద్ర పటేల్ నాయత్వంలో గుజరాత్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. శాంతిభద్రతలు మరింత బలోపేతం కావడంతో పాటు సీఎం భూపేంద్ర పటేల్.. ఆర్థికవ్యవస్థను పురోగమనంలో నిలిపారన్నారు. అలాగే, విద్య, వైద్యంతో పాటు అనేక ఇతర రంగాలను అభివృద్ధి చేశారంటూ అమిత్ షా ప్రశంసించారు.
గతంలో మోదీ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధి నమూనాను భూపేంద్ర పటేల్ ముందుకు తీసుకెళ్తున్నారని అమిత్ షా కొనియాడారు. ఈ ఎన్నికల్లో భాజపాకు మంచి మెజార్టీ వస్తే భూపేంద్ర పటేల్ మళ్లీ సీఎంగా కొనసాగుతారంటూ నిన్న ఓ సభలో అమిత్ షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 182 సీట్లు ఉన్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనున్నాయి. తొలి విడతలో 89 స్థానాలకు, రెండో విడతలో 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ