Karnataka: ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.. భాజపాకు 65 సీట్లకు మించవు: డీకేఎస్
కర్ణాటక(Karnataka)లో భాజపా ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. ఈసారి ఆ పార్టీకి 65సీట్లకు మించి రావని కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు.
బెంగళూరు: త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(Karnataka assembly polls) భాజపా గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని రాష్ట్ర కాంగ్రెస్(congress) చీఫ్ డీకే శివకుమార్(DKS) అన్నారు. మొత్తం 224 సీట్లకు గాను అధికార భాజపాకు 65 సీట్లకు మించి రావని.. సీట్లు 40కి తగ్గినా ఆశ్చర్యంలేదని వ్యాఖ్యానించారు. మే నెలలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 140 సీట్లు సాధిస్తుందంటూ నిన్న కొన్ని సర్వే సంస్థల అంచనాలు వెలువడిన నేపథ్యంలో బుధవారం ఆయన స్పందించారు. బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. తమకు వచ్చే సీట్ల విషయంలో గ్యారెంటీ ఉందన్నారు. అలాగే, భాజపాకు 65కి మించి సీట్లు రావన్న విషయంలోనూ తమకు ఓ అంచనా వచ్చినట్టు తెలిపారు. భాజపా ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో 140 సీట్లకు పైగా గెలుచుకుంటామని యడియూరప్ప ఇటీవల చేసిన వ్యాఖ్యలు వారి అంతర్గతమని.. వారి పార్టీ విషయాల్లో తాను జోక్యం చేసుకోలేనన్నారు. భాజపా నేతలు ఏం చేసినా సరే.. ఆ పార్టీకి 60 నుంచి 65 సీట్లకు మించి రావన్నారు. ఒకవేళ 40 సీట్లకన్నా తక్కువ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు. 2008-13లో భాజపా అధికారంలో ఉన్న తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి 40 సీట్లే వచ్చాయని గుర్తు చేశారు. అలాగే, ‘40శాతం కమీషను’ తీసుకొని పనిచేస్తోన్న భాజపా ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో సీట్లు 40కి పడిపోవడంలే ఆశ్చర్యం ఏముందని తీవ్రంగా విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీని బోగస్ అంటూ సీఎం బొమ్మై చేసిన వ్యాఖ్యల్ని డీకేఎస్ తిప్పికొట్టారు. అబద్ధాలు చెప్పడంలో బొమ్మైకి ఎవరూ సాటిరారని ధ్వజమెత్తారు.
మరోవైపు, ఎన్నికలకు సమయం ఇంకా రెండు నెలల సమయమే మిగిలి ఉన్న నేపథ్యంలో కర్ణాటకలోని రాజకీయ పార్టీలు విజయమే లక్ష్యంగా అస్త్రాలను సిద్ధం చేసుకొంటున్నాయి. ఆయా వర్గాల ప్రజల్ని తమవైపు ఆకర్షించుకొనే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రజాకర్షక పథకాలను ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా అభ్యర్థుల ఎంపికపైనా ప్రధానంగా దృష్టిపెట్టి తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి స్క్రీనింగ్ సమావేశం నిర్వహించింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి 75శాతం ప్రక్రియ పూర్తయిందని.. ఈరోజు మిగతాది పూర్తిచేసి జాబితాను పార్టీ అధిష్ఠానానికి పంపనున్నట్టు డీకేఎస్ తెలిపారు. 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 104 సీట్లు గెలుచుకొని ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. అయితే, కాంగ్రెస్కు 80, జేడీఎస్ 37 సీట్లలో గెలుపొందడంతో ఆ రెండు పార్టీలు జట్టుకట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గద్దెనెక్కాయి. ఈ క్రమంలోనే కొందరు జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి భాజపా వైపు వెళ్లడంతో అధికారానికి కావాల్సిన బలం పొందిన భాజపా ఆ తర్వాత అధికార పీఠం దక్కించుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి కాదా అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు (7)
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్పై ఒంటరిగానే నా పోరాటం
‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు. -
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. -
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. -
శివసేన (శిందే)లో చేరిన నటుడు గోవిందా
సార్వత్రిక ఎన్నికల ముందు బాలీవుడ్ నటుడు గోవిందా (60) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పార్టీ ‘తెలంగాణ ప్రజల ముంగిట్లోకి జాతీయ మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?