ఆ గాయం దీదీని ఎప్పటికీ వెంటాడుతుంది: షా
బెంగాల్లో ఇటీవల టీఎంసీ నేతల దాడిలో గాయాల పాలైన భాజపా కార్యకర్త తల్లి మృతి చెందడం తనను ఆవేదనకు గురిచేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు.
దిల్లీ: బెంగాల్లో ఇటీవల టీఎంసీ నేతల దాడిలో గాయాల పాలైన భాజపా కార్యకర్త తల్లి మృతి చెందడం తనను ఆవేదనకు గురిచేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి తగిలిన గాయం మమతా బెనర్జీని ఎప్పటికీ వెంటాడుతుందని మండిపడ్డారు. ఈ మేరకు షా ట్విట్ ద్వారా మృతురాలి కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు.‘టీఎంసీ కార్యకర్తల చేతిలో దాడికి గురై బెంగాల్ కుమార్తె శోభా మజుందార్(84) మరణించడం ఆవేదనకు గురిచేసింది. ఆ కుటుంబానికి కలిగిన గాయం మమతా బెనర్జీని ఎల్లకాలం వెంటాడుతుంది. బెంగాల్ ప్రజలు హింసకు తావు లేని రాష్ట్రం కోసం, మహిళలకు రక్షణ కల్పించే రాష్ట్రం కోసం పోరాటం చేయాలి’ అని షా ట్వీట్లో పేర్కొన్నారు.
భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఈ విషయంపై ట్విటర్ ద్వారా స్పందించారు. ‘శోభా మజుందార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. కేవలం తన కుమారుడు భాజపా కార్యకర్త కావడం వల్లే ఈ రోజు ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె త్యాగం ఎల్లప్పటికీ నిలిచిపోతుంది. బెంగాల్లో తల్లులు, సోదరీమణుల సంరక్షణకు భాజపా పోరాడుతుంది’ అని నడ్డా తెలిపారు.
గతనెలలో బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా నింతా పోలీస్స్టేషన్ పరిధిలో గోపాల్ మజుందార్ అనే తమ కార్యకర్త ఇంటిపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని భాజపా ఆరోపించింది. తమ కార్యకర్తపై, 84 ఏళ్ల వయసున్న అతడి తల్లిపై టీఎంసీ కార్యకర్తలు దారుణంగా దాడికి పాల్పడ్డారని మండిపడింది. కాగా, ఈ ఆరోపణల్ని టీఎంసీ పార్టీ ఖండించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!