‘అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ’

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ గవర్నర్‌కు రాసిన లేఖలోనివన్నీ అబద్ధాలేనని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో...

Published : 20 Jul 2020 01:48 IST

చంద్రబాబుపై మంత్రి బొత్స విమర్శలు

విశాఖపట్నం: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ గవర్నర్‌కు రాసిన లేఖలోనివన్నీ అబద్ధాలేనని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో విలేకర్లతో మంత్రి బొత్స మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ నిర్ణయమన్నారు. ఒకే చోట రూ.లక్ష కోట్ల ఖర్చు సరికాదని జగన్‌ గతంలోనే చెప్పారని పేర్కొన్నారు. పార్లమెంట్‌ స్థానాలను జిల్లాలుగా మారుస్తామని ఎన్నికల ముందే హామీ ఇచ్చామని చెప్పారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే కేవలం ఒక్క ప్రాంతంపైనే దృష్టి పెట్టారని బొత్స విమర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని