BRS: దిల్లీలో భారాస జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్‌

దేశ రాజధాని దిల్లీలో భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) జాతీయ కార్యాలయం ప్రారంభమైంది. సర్దార్‌ పటేల్‌ రోడ్డులోని కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

Updated : 14 Dec 2022 13:04 IST

హైదరాబాద్‌: దేశ రాజధాని దిల్లీలో భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) జాతీయ కార్యాలయం ప్రారంభమైంది. సర్దార్‌ పటేల్‌ రోడ్డులోని కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. తొలుత అక్కడ రాజశ్యామల, నవచండీయాగాలు నిర్వహించారు. ఈ యాగాల్లో కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవితతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, జేడీఎస్‌ నేత కుమార స్వామి హాజరయ్యారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం భారాస జెండాను కేసీఆర్‌ ఆవిష్కరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని