ఎమ్మెల్యే టికెట్‌ రాలేదని బోరున విలపించాడు.. వీడియో వైరల్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడ ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఎస్పీ నుంచి టిక్కెట్‌ ఆశించి భంగపడిన .....

Updated : 15 Jan 2022 16:27 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడ ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఎస్పీ నుంచి టిక్కెట్‌ ఆశించి భంగపడిన ఓ నేత బోరున విలపించడం చర్చనీయాంశంగా మారింది. బీఎస్పీకి చెందిన అర్షద్‌ రాణా అనే నేత ముజఫర్‌నగర్‌లోని చార్తావల్‌ స్థానం నుంచి టిక్కెట్‌ ఆశించారు. చాలా ఏళ్లుగా పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు. ఆయన భార్య కూడా అదే పార్టీ కోసం పనిచేస్తున్నారు. అయితే, చార్తావల్‌ నుంచి వేరే వ్యక్తిని బరిలోకి దించినట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇటీవల ప్రకటించడంతో  తీవ్ర మనస్తాపానికి గురైన అర్షద్‌ రాణా సామాజిక మాధ్యమాల ద్వారా తన ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి బోరున విలపించారు.

తనకు టికెట్‌ ఇప్పిస్తానంటూ పార్టీ నేత ఒకరు రెండేళ్ల క్రితం రూ.50లక్షలు డిమాండ్‌ చేశారనీ.. రూ.నాలుగున్నర లక్షలు ఇప్పటికే ఇచ్చానన్నారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. అర్షద్‌ బోరున విలపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు