ఎమ్మెల్యే టికెట్ రాలేదని బోరున విలపించాడు.. వీడియో వైరల్
ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడ ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఎస్పీ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడిన .....
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడ ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఎస్పీ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడిన ఓ నేత బోరున విలపించడం చర్చనీయాంశంగా మారింది. బీఎస్పీకి చెందిన అర్షద్ రాణా అనే నేత ముజఫర్నగర్లోని చార్తావల్ స్థానం నుంచి టిక్కెట్ ఆశించారు. చాలా ఏళ్లుగా పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు. ఆయన భార్య కూడా అదే పార్టీ కోసం పనిచేస్తున్నారు. అయితే, చార్తావల్ నుంచి వేరే వ్యక్తిని బరిలోకి దించినట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇటీవల ప్రకటించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అర్షద్ రాణా సామాజిక మాధ్యమాల ద్వారా తన ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి బోరున విలపించారు.
తనకు టికెట్ ఇప్పిస్తానంటూ పార్టీ నేత ఒకరు రెండేళ్ల క్రితం రూ.50లక్షలు డిమాండ్ చేశారనీ.. రూ.నాలుగున్నర లక్షలు ఇప్పటికే ఇచ్చానన్నారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. అర్షద్ బోరున విలపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట