- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
ముగిసిన బుగ్గన దిల్లీ పర్యటన
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన స్టేట్ డెవలప్మెంట్ రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించాలని.. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగిన ప్రాధాన్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. రెండు రోజుల పర్యటనపై దిల్లీ వెళ్లిన బుగ్గన.. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, జలశక్తి శాఖ కార్యదర్శి, పౌర విమానాయన శాఖ ఉన్నతాధికారులను కలిశారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్కు వివరించినట్లు చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి పునరావసం, పరిహారం అంశంలో కొత్త అంచనాలను ఆమోదించేలా చూడాలని కోరినట్లు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఒర్వకల్లు విమానాశ్రయం ప్రారంభోత్సవం, కమర్షియల్ విమానాల రాకపోకలపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించినట్లు వివరించారు. అప్పర్ సీలేరు ప్రాజెక్టు రివర్స్ పంపింగ్తో విద్యుత్ ఆదా అవుతుందని.. ఆ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ను కోరినట్లు మంత్రి తెలిపారు.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Corona: దిల్లీలో ఆస్పత్రుల్లో చేరికలు 60% పెరిగాయ్..!
-
India News
వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ.. కేంద్ర కేబినెట్ నిర్ణయం
-
Politics News
Revanth Reddy: సీఎల్పీ బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారు?.. పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం
-
India News
Vaccines: ప్రపంచంలో వినియోగించే అన్ని టీకాల్లో.. 60శాతం భారత్వే..!
-
Movies News
Tollywood: విజయేంద్రప్రసాద్ కథతో భారీ బడ్జెట్ మూవీ.. దర్శకుడు ఎవరంటే?
-
Politics News
Telangana News: కాంగ్రెస్లో మరో అసమ్మతి స్వరం.. పీసీసీ తీరుపై మర్రి శశిధర్రెడ్డి అసహనం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- TSRTC: హైదరాబాద్లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- S Jaishankar: కుమారుడితో రెస్టారెంట్కు కేంద్రమంత్రి.. తర్వాత ఏం జరిగిందంటే..?
- Naga Chaitanya: ఆ నటి అంటే నాకెంతో ఇష్టం: నాగచైతన్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- Meira Kumar: 100ఏళ్ల క్రితం మా నాన్న జగ్జీవన్రామ్నూ ఇలాగే కొట్టారు..