cabinet: మోదీ టీమ్లో ఇతడే చిన్నోడు
గల్లీ నుంచి దిల్లీ వరకు ఆయన రాజకీయ ప్రస్థానం ఇలా...
35ఏళ్లకే కేంద్రమంత్రిగా నిషిత్ ప్రామాణిక్
దిల్లీ: ఒకప్పుడు తలపండిన రాజకీయ నాయకులే కేంద్రమంత్రులుగా ఉండేవారు. ప్రస్తుతం ఆ భావన పూర్తిగా మారిపోతోంది. ప్రతిభ ఉంటే చాలు వయసుతో సంబంధం లేదు. అందుకు నిదర్శనం బుధవారం కొత్తగా నియమితులైన కేంద్ర మంత్రుల్లో పశ్చిమబెంగాల్కి చెందిన 35ఏళ్ల నిషిత్ ప్రామాణిక్. చిన్న వయస్సులోనే కేంద్రమంత్రి వర్గంలో చోటు సంపాదించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. నిషిత్ ప్రామాణిక్కు హోం, యువజన, క్రీడాశాఖ సహాయ మంత్రిగా అవకాశం కల్పించారు. గల్లీ నుంచి దిల్లీ వరకు ఆయన రాజకీయ ప్రస్థానం ఇలా...
పశ్చిమబెంగాల్లోని దిన్హతాలో జనవరి 17, 1986లో జన్మించారు నిషిత్. బాలకూర జూనియర్ బేసిక్ స్కూల్ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్లో బ్యాచ్లర్స్ పట్టా పొందారాయన. ప్రారంభంలో ఓ ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్గా పనిచేసి.. ఆపై తృణమూల్ కాంగ్రెస్లో యూత్ లీడర్గా సేవలందించారు. అనంతరం 2019లో భాజపాలో చేరారు. పశ్చిమబెంగాల్లోని కోచ్ బిహార్ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసి గెలుపొందారు.
టీఎంసీపై స్వత్రంత్రులను దింపి..
అది 2018.. బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు. అధికార పార్టీని ఢీకొట్టి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం మామూలు విషయం కాదు. అలాంటి పరిస్థితుల్లో నిషిత్ తనదైన రాజకీయ వ్యూహాలతో రంగంలోకి దిగాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 300 మందికి పైగా స్వతంత్ర అభ్యర్థులను టీఎంసీకి పోటీగా నిలిపి, వారిలో అత్యధిక మంది విజయం సాధించేలా చేశాడు.
2019లో భాజపాలోకి ఎంట్రీ
2019 ఫిబ్రవరిలో కాషాయతీర్థం పుచ్చుకున్న నిషిత్ ఆ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నాడు. కోచ్ బిహార్లో టీఎంసీకి ప్రాబల్యం ఎక్కువ. అయినా కూడా లోక్సభ ఎన్నికల్లో తన సత్తా చాటారు నిషిత్. టీఎంసీ అభ్యర్థి చంద్రా అధికారిపై సుమారు 54వేల ఓట్ల తేడాతో విజయ ఢంకా మోగించారు. అయితే, ఈ ఏడాది జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసిన నిషిత్ దిన్హతా నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలుపొందారు. అయితే పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తాజాగా కేంద్ర మంత్రిగా పదవీ ప్రమాణం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేనీటి వెనక కన్నీటి ధారలు!
మన దేశంలో వేడివేడి ఛాయ్ మజాను ఆస్వాదించనివారు అరుదు. చాలా ఇళ్లలో చుట్టాలకు తొలి పలకరింపు తేనీటితోనే! పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకునేటప్పుడు.. స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడేటప్పుడు.. చాలామందికి టీ కప్పు చేతిలో ఉండాల్సిందే!! -
12 మందికి నేరచరిత్ర
రాజస్థాన్లో లోక్సభకు పోటీ చేస్తున్న 12 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో కొందరిపై హత్య కేసులూ ఉన్నాయి. -
నవనీత్ రాణా.. ఓ నృత్యకారిణి
మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి పోటీచేస్తున్న భాజపా అభ్యర్థి, సినీనటి నవనీత్ రాణాపై శివసేన(యూబీటీ) నేత సంజయ్రౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి. -
సంక్షిప్త వార్తలు
ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. మోదీ వచ్చాకే ఈ ప్రాంతం మిగిలిన దేశంతో మమేకమైంది. -
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
ఇది వారణాసి, వయనాడ్ మధ్య పోరాటం
తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాహుల్గాంధీని తాము కోరినా వయనాడ్ వైపే మొగ్గు చూపారని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కేరళ రాష్ట్రం వయనాడ్లో కాంగ్రెస్ పార్టీ గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. -
రాహుల్ను ప్రధానిని చేయాలి: తుమ్మల
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 15 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని... రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలను కోరారు. -
మాదిగలకు కాంగ్రెస్ రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించాలి
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మాదిగలకు రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్లో అమీర్పేట లీలానగర్లోని తన నివాసంలో గురువారం నిరసన దీక్ష చేపట్టారు. -
భాజపాను అడ్డుకుంటేనే రేవంత్కు, లౌకికవాదానికి మంచిది
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవాలని.. కేరళకు వెళ్లి ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న వామపక్షాలపై ఆయన నోరు పారేసుకోవడం సరైంది కాదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
రేవంత్రెడ్డికి ఓట్లడిగే హక్కు లేదు: లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రాజ్యసభ సభ్యుడు, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ విమర్శించారు. -
రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, వరి, మొక్కజొన్న పంటలకు రూ.500 బోనస్ ఇస్తామంటూ బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నాలుగు నెలల్లోనే కర్షకుల ఉసురు పోసుకుంటోందని, వారిని వేదనకు గురిచేస్తోందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. -
భాజపాతోనే వికసిత తెలంగాణ: గోవా సీఎం
గత పదేళ్లలో తెలంగాణను భారాస అధినేత కేసీఆర్ దోపిడీ చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొల్లగొడుతోందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్సావంత్ ఆరోపించారు. -
ఈటల సేవలు దేశానికి అవసరం
కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించిన ఈటల రాజేందర్ను లోక్సభ ఎన్నికల్లో గెలిపించి దేశవ్యాప్తంగా ఆయన సేవలు విస్తరిద్దామని కేంద్ర పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖల మంత్రి హర్దీప్సింగ్ పురి అన్నారు. -
రత్నగిరి-సింధుదుర్గ్ భాజపా అభ్యర్థిగా నారాయణ్ రాణె
కేంద్రమంత్రి నారాయణ్ రాణెను మహారాష్ట్రలోని రత్నగిరి-సింధుదుర్గ్ లోక్సభ స్థానం నుంచి బరిలో దింపాలని భాజపా నిర్ణయించింది. -
భారాస నాయకులను చేర్చుకోవద్దు
భారాస నాయకులను కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ వనపర్తి జిల్లా గోపాల్పేట మండల పార్టీ అధ్యక్షుడు గణేశ్గౌడ్, నాయకుడు శేఖర్ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎదుటే పెట్రోలు పోసుకుని నిరసనకు దిగారు. -
అమ్మ మరణాన్ని తట్టుకోలేకపోతున్నా
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హిమాచల్ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్నిహోత్రి కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి విముఖత వ్యక్తం చేశారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
కృష్ణుడి గోపికను నేనే హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
ఎన్నికల కమిషన్ కాదు.. భాజపా కమిషన్: మమత
ముర్షీదాబాద్ రామనవమి ర్యాలీలో చోటు చేసుకున్న హింసపై పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, భాజపాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. -
ఢీకొడుతున్న ఇండియా!
రాజస్థాన్లోని 12 స్థానాలకు తొలి విడతలో భాగంగా శుక్రవారం పోలింగ్ జరగనుంది. 2,53,15,541 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
పశ్చిమ పవర్ ఎవరిది?
సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలక రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. ఇక్కడ ఆధిక్యం సాధించే పార్టీయే దాదాపుగా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు