Kanpur Mayor: ఓటేసి.. ఫొటో తీసి.. షేర్ చేసిన మేయర్
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్ కొనసాగుతున్న యూపీలోని కాన్పూర్లో ఆ నగర మేయర్ ప్రమీలా పాండే చేసిన ఓ పని ఇప్పుడు వివాదాస్పదంగా మారింది....
కాన్పూర్: అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోన్న యూపీలోని కాన్పూర్లో ఆ నగర మేయర్ ప్రమీలా పాండే చేసిన ఓ పని ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పోలింగ్ బూత్లో ఓటేసిన తర్వాత ఫొటోలు, వీడియోలు తీయడం చర్చనీయాంశమైంది. అంతటితో ఆగకుండా వాటిని కొన్ని వాట్సాప్ గ్రూప్లలో పోస్ట్ చేసినట్లు సమాచారం.
కాన్పూర్లోని హడ్సన్ స్కూల్లో ఆమె ఓటువేశారు. ఈవీఎంపై మీట నొక్కుతున్న దృశ్యాన్ని ఆమె ఫొటో, వీడియో తీశారు. దాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో ఆ చిత్రాలు వైరల్గా మారాయి. ఈ విషయం ఆ జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద చర్యలకు ఉపక్రమించారు. సంబంధిత సెక్షన్ల కింద ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించినట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ఉత్తర్ప్రదేశ్లో నేడు మూడో దశలో భాగంగా మొత్తం 59 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.15 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తున్న కర్హల్ సీటుకు నేడే పోలింగ్ జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ