రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై 22న విచారణ

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం

Published : 16 Apr 2021 01:07 IST

దిల్లీ: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. సాక్షులను జగన్ ప్రభావితం చేస్తున్నారని.. ఆయన బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించి వేగంగా విచారణ చేపట్టాలని కోరుతూ రఘురామకృష్ణరాజు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌తో పాటు అనుబంధ దస్త్రాలు సరిగా లేనందున విచారణార్హం కాదని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది. తాజాగా కోర్టు పేర్కొన్న అభ్యంతరాలపై వివరణ ఇస్తూ మరిన్ని దస్త్రాలు సమర్పించడంతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంది. ఈ నెల 22న పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు సీబీఐ న్యాయస్థానం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని