ఓటు మన హక్కు.. కదలండి.. ఓటేయండి
మన నగరం.. మన రాజధాని.. మన హైదరాబాద్.. మన భవిష్యత్తు.. మన పాలన.. అన్నీ మన చేతిలోనే ఉన్నాయి. ఓటు వేసి మన శక్తిని చూపిద్దాం
సినీ ప్రముఖుల పిలుపు
• మన నగరం.. మన రాజధాని.. మన హైదరాబాద్.. మన భవిష్యత్తు.. మన పాలన.. అన్నీ మన చేతిలోనే ఉన్నాయి. ఓటు వేసి మన శక్తిని చూపిద్దాం.
- అక్కినేని నాగార్జున
• అప్నా హైదరాబాద్ అంటూ ఈ నగరాన్ని మనం నిజంగానే ప్రేమిస్తే తప్పకుండా ఓటేయాలి. నగరానికి మంచి పాలన అవసరం. మన హక్కును వినియోగించుకుందాం..
- దర్శకులు శేఖర్ కమ్ముల
• గ్రేటర్ హైదరాబాద్లో ఇపుడు ఓటరే బాహుబలి డబ్బులు, మద్యానికి ఆశపడి చేసుకోకు నీ బతుకు బలి..!అభ్యర్థులు ఎలాంటివారో, గత చరిత్ర ఏమిటో..ప్రజా సేవపై వారికున్న ప్రేమ ఎంతో నిర్ణయించి ఓటు వేయాలి నేడు.. నచ్చకుంటే బ్యాలెట్లో ‘నోటా’ ఉంది చూడు..!
- సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ
• గాలి, నీరు, నింగి, నిప్పు, నేల.. ఇవి ప్రకృతి మనకు ప్రసాదించిన 5 వనరులు. రాజ్యాంగం మనకు కల్పించిన ఆరో వనరు ఓటుహక్కు. దానిని వినియోగించుకుందాం.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుందాం. రండి.. హైదరాబాద్ అభివృద్ధి కోసం అందరం ఓటేద్దాం..
- వ్యాఖ్యాత, నటి ఝాన్సీ
• ఓటు మన హక్కు.. మన బాధ్యత.. మన ఉనికి.. మన అస్తిత్వం.. ఓటే మన ఆత్మగౌరవం.. ఇది రాజ్యాంగం మనకిచ్చిన ఆయుధం.. సక్రమంగా వాడదాం.. సద్వినియోగం చేసుకుందాం.. లెట్స్ ఓట్..!!
- వ్యాఖ్యాత సుమ కనకాల
• నేడు జరిగే ఎన్నికల్లో మనందరం తప్పనిసరిగా హక్కు వినియోగించుకుందాం. మహానగరం అభివృద్ధి కోసం ఓటేద్దాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ఒక్క ఓటే కదాని ఎవరూ అశ్రద్ధ చేయొద్దు.. అదే రేపు ఫలితాన్ని మార్చుతుంది.
- ఎన్.శంకర్, దర్శకుడు
• భావి తరాల అభివృద్ధిని నిర్దేశించే ఎన్నికల్లో సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని వదులుకోకూడదు. సెలవు ఇచ్చారని ఇంట్లో కూర్చోకుండా తప్పకుండా ఓటేయాలి. ఏమీ ఆశించకుండా ఓటేసినప్పుడే అభివృద్ధిపై నాయకులను ప్రశ్నించే వీలు కలుగుతుంది.
- అలీ, సినీ నటుడు
• ప్రజలు పాలనలో భాగస్వాములవ్వాలి. వార్డు కమిటీల్లో స్థానం కల్పించాలి. దిల్లీ తరహాలో స్వయం పరిపాలన అవసరం. ప్రజల కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు అన్న భావన కలిగించాలి. అప్పుడే ఓటేసేందుకు ఉత్సాహం చూపిస్తారు.
- జయప్రకాశ్ నారాయణ, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు
• పౌరుడిగా పాలకులను నిర్ణయించుకునే హక్కు ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. ఓటేయడం మన బాధ్యత. నగర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ హక్కును వినియోగించుకోవాలి.
- మహేశ్బాబు
• ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటేయాలి. పోలింగ్ కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కులతో వెళ్దాం. హైదరాబాద్ అభివృద్ధి, శాంతి సౌభాగ్యాల కోసం మన హక్కును ఉపయోగిద్దాం.
- విజయ్ దేవరకొండ
• ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకునేందుకు ఓటు మనకు సువర్ణావకాశం.ఏ ఎన్నిక అయినా అందులో పాల్గొనడం, ఓటేయడంతో పాటు సమర్థులైన నాయకులను ఎన్నుకోవడం అవసరం. అప్పుడే అభివృద్ధి సాధ్యం.
- ప్రియమణి
• ఓటు మన హక్కే కాదు బాధ్యత కూడా.ఉద్వేగాలకు, డబ్బులకు దానిని ఫణం పెట్టొద్దు. ఓటు తప్పకుండా వేయడం ఎంత అవసరమో, ఆలోచించి వేయడం కూడా అంతే అవసరమని గుర్తించాలి.
- సుధీర్బాబు
• మనిషిని బతికించాలంటే రక్తం ఎంత అవసరమో మానవ మనుగడకు ఓటూ అంతే. మన శ్రేయస్సును కోరే నాయకులకు అది ‘విజయ తిలకమవ్వాలి. నచ్చని లీడర్ల పాలిట వేటవ్వాలి. ఓటును అమ్మకండి.
- ఉత్తేజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’.. హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు.