Telangana news: తెరాస వీడ్కోలు ప్రసంగంలా బడ్జెట్ సమావేశాలు: కిషన్రెడ్డి
భాజపా ఎమ్మెల్యేలను చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ వ్యవస్థను, గవర్నర్లను ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయలో అవమానించలేదని
హైదరాబాద్: భాజపా ఎమ్మెల్యేలను చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ వ్యవస్థను, గవర్నర్లను ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో అవమానించలేదని మండిపడ్డారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ఏనాడూ నిర్వహించలేదన్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా లేవని.. పేరుగొప్ప.. ఊరు దిబ్బలా తెరాస బడ్జెట్ ఉందన్నారు. తెరాస ఎంపీలు పార్లమెంట్లో ఎంత ఆందోళన చేసినా కేంద్రం వారిని సస్పెండ్ చేయలేదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్పై స్పందిస్తూ.. ప్రభుత్వం దారి తప్పినప్పుడు ప్రశ్నించే అధికారం ఎమ్మెల్యేలకు ఉంటుందని పేర్కొన్నారు. ప్రశ్నంచే గొంతు నొక్కేందుకే భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాలు తెరాస వీడ్కోలు ప్రసంగంలా సాగాయని కిషన్రెడ్డి చురకలంటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!