- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
బెంగాల్లో హ్యాట్రిక్ సాధిస్తాం: మమతా
కోల్కతా: బెంగాల్ రైతులకు పీఎం కిసాన్ లబ్ది చేకూర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులకు పీఎం కిసాన్ ఇవ్వాలని తాము జాబితా పంపినప్పటికీ కేంద్రం నిధులు ఇవ్వడానికి నిరాకరించిందని ఆమె విమర్శించారు. ఈ మేరకు మమతా బెనర్జీ మంగళవారం పుర్బ వర్దమాన్ జిల్లాలోని కల్నాలో నిర్వహించిన సభలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
‘నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ కేంద్రం వారిని పట్టించుకోవడం లేదు. భాజపా దేశాన్ని భ్రష్టు పట్టిస్తోంది. బెంగాల్ను అలా కావడాన్ని మేం అనుమతించం. మా పార్టీ ప్రజల్లో మతం, కులం ఆధారంగా విభజన రాజకీయాలు చేయదు. రాష్ట్రంలోని రైతులకు టీఎంసీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5వేలు ఇస్తోంది. అంతేకాకుండా ఉచిత పంట బీమా సౌకర్యం కూడా కల్పిస్తోంది. కానీ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తొలుత రాష్ట్ర రైతులకు పీఎం కిసాన్ నిధులు ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పుడు టీఎంసీ ప్రభుత్వమే రైతుల్ని ఆ పథకానికి దూరం చేసిందని అబద్ధాలు చెబుతోంది’ అని మమతా భాజపాపై మండిపడ్డారు. బెంగాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించి.. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ధీమాను వ్యక్తం చేశారు. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: కేంద్రం ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు: సీఎండీ ప్రభాకర్రావు
-
Movies News
Chiranjeevi: సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ట్రోఫీ.. జెర్సీని ఆవిష్కరించిన చిరంజీవి
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Manish Sisodia: 16 మంది నిందితుల్లో సిసోదియా నం.1: సీబీఐ ఎఫ్ఐఆర్
-
Movies News
ponniyin selvan: ‘పొన్నియిన్ సెల్వన్’కు ద్వారాలు తెరిచింది ‘బాహుబలి’
-
India News
Noida Twin Towers: అంతా సిద్ధం! ఆ 40 అంతస్తుల టవర్లు ఎలా కూల్చుతారంటే..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్షిప్పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం
- Vijay Deverakonda: తెలుగు ప్రెస్మీట్ వివాదం.. స్పందించిన విజయ్ దేవరకొండ
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Tamil rockerz Review: రివ్యూ: తమిళ్ రాకర్స్
- Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్గా పంపించాలనే ఐడియా ఎవరిది..?