అర్ధరాత్రి అక్రమ కేసు దారుణం: చంద్రబాబు
ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఆనందయ్య తాపత్రయపడుతుంటే... వైకాపా నేతలు అందులోనూ అవినీతికి ప్రయత్నిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు..
అమరావతి: ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఆనందయ్య తాపత్రయపడుతుంటే... వైకాపా నేతలు అందులోనూ అవినీతికి ప్రయత్నిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా నేతల అక్రమాలను, అవినీతిని ప్రశ్నించి, దోపిడీని ఆధారాలతో సహా బయట పెట్టినందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై అర్ధరాత్రి అక్రమ కేసు పెట్టడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
అర్ధరాత్రి కేసు నమోదు చేయడంతోనే ఇది అక్రమ కేసని, ఇందులో కుట్ర ఉందని స్పష్టమవుతోందన్నారు. అర్ధరాత్రి కేసులు, తెల్లవారుజాము కూల్చివేతలు వంటి మూర్ఖపు చర్యలతో జగన్ రాష్ట్రాన్ని ప్రతీకార కుంపటిగా మార్చారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ.. పౌర హక్కుల్ని అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ వెబ్సైట్ రూపొందించి మందులు అమ్ముకునేందుకు ప్రయత్నించిన వారిని వదిలేసి అవినీతి బట్టబయలు చేసిన సోమిరెడ్డిపై దొంగతనం, ఫోర్జరీ, చీటింగ్ అంటూ నాన్బెయిలబుల్ కేసులు పెడతారా అని నిలదీశారు. ఆనందయ్య అనుమతి నిరాకరించినా దొడ్డిదారిన ఆన్లైన్ అమ్మకాలకు ప్రయత్నించిన సెశ్రిత టెక్నాలజీస్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దొంగతనంగా వ్యాపారం చేసేందుకు ప్రయత్నించిన వైకాపా నేతలపైనే ఐపీసీ సెక్షన్ 379, 468, 506, ఐటీ యాక్ట్ 56 కింద కేసు పెట్టాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట