Chandrababu: శ్మశానం అన్న వాళ్లే.. తాకట్టు పెట్టి నిధులు తెచ్చుకుంటున్నారు: చంద్రబాబు

800 రోజులుగా పోరాడుతున్న అమరావతి ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఉద్యమాభివందనాలు

Published : 25 Feb 2022 01:45 IST

అమరావతి: 800 రోజులుగా పోరాడుతున్న అమరావతి ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఉద్యమాభివందనాలు తెలిపారు. రైతులు ఉద్యమం, పోరాటానికి తెదేపా సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. రూ.లక్షల కోట్ల సంపద సృష్టించే రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసిన సీఎం జగన్‌ను చరిత్ర ఎప్పటికీ క్షమించదని చంద్రబాబు అన్నారు.

రాజధాని ప్రాంతం శ్మశానం అన్న వాళ్లే ఇప్పుడు అమరావతి భూములను తాకట్టు పెట్టి నిధులు తెచ్చుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రానికి అమ్మలాంటి అమరావతిని కూల్చాలనే కుట్ర చేసిన జగన్‌.. అన్ని రంగాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. జగన్‌ అండ్‌ కో చేసిన ప్రతి ఆరోపణ అబద్ధమని నిరూపిస్తూ ఠీవీగా నిలబడ్డ అమరావతి.. ఈ పోరాటంలో విజయం సాధిస్తుందని లోకేశ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని