Andhra News: ఈ ప్రభుత్వం ఏం చేసిందని గడప గడపకు వెళ్తోంది?: చంద్రబాబు
రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన.. స్థానిక యువతతో సమావేశమై మాట్లాడారు.
కుప్పం: రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన.. స్థానిక యువతతో సమావేశమై మాట్లాడారు. ఉద్యోగాలు కల్పించే కోర్సులను వర్సిటీల్లో రద్దు చేశారన్నారు. ఉపాధి లేకుంటే యువత నిరాశ, నిస్పృహలకు లోనవుతారని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వంపై తాను చేసే యుద్ధం యువత భవిష్యత్తు కోసమేనన్నారు. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో యువతకే 40 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఆ హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఎందుకు తీసేశారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందని గడప గడపకు వెళ్తోంది? అని చంద్రబాబు ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!