Andhra News: ఈ ప్రభుత్వం ఏం చేసిందని గడప గడపకు వెళ్తోంది?: చంద్రబాబు

రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన.. స్థానిక యువతతో సమావేశమై మాట్లాడారు.

Published : 14 May 2022 02:40 IST

కుప్పం: రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన.. స్థానిక యువతతో సమావేశమై మాట్లాడారు. ఉద్యోగాలు కల్పించే కోర్సులను వర్సిటీల్లో రద్దు చేశారన్నారు. ఉపాధి లేకుంటే యువత నిరాశ, నిస్పృహలకు లోనవుతారని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వంపై తాను చేసే యుద్ధం యువత భవిష్యత్తు కోసమేనన్నారు. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో యువతకే 40 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. ఆ హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఎందుకు తీసేశారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందని గడప గడపకు వెళ్తోంది? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని