కరోనా ముప్పు తెలిసే అలా చేశారు: చంద్రబాబు
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి కరోనా బారినపడడటం బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్లో పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన 24గంటల్లోనే కరోనా నిబందనలంటూ ...
అమరావతి: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి కరోనా బారినపడడటం బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్లో పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన 24గంటల్లోనే కరోనా నిబందనలంటూ మళ్లీ కేసు పెట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు. దోపిడీ దొంగలకు, ప్రజల నుంచి వచ్చిన నాయకులకు తేడా తెలియదా?అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు, ప్రభాకర్రెడ్డి కరోనా బారిన పడ్డారంటే కారణమెవరని నిలదీశారు. కరోనా ముప్పు తెలిసీ ప్రజా నాయకుల పట్ల దారుణంగా నడుచుకుంటారా అని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్రెడ్డికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్లో రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి: యనమల
శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. ప్రధానమంత్రికి చంద్రబాబు లేఖ రాస్తే హోం మంత్రి డీజీపీ.. భుజాలు తడుముకోవడమేంటని ప్రశ్నించారు. ‘‘ఏపీలో ఫోన్ ట్యాపింగ్లలో సుప్రీంకోర్టు పేర్కొన్న హేతుబద్ద కారణాలు ఉన్నాయా?. ఆర్టికల్ 19, 21 ప్రకారం ఇది రాజ్యాంగ, కేంద్ర చట్టాల ఉల్లంఘనే. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ పౌర హక్కులను, ప్రాథమిక హక్కులను కాలరాయడమే. ప్రధాని స్పందించే వరకు డీజీపీ, హోం మంత్రి ఎందుకు ఆగలేక పోయారు?. వాదనలు వినిపించే న్యాయవాదుల ఫోన్ ట్యాపింగ్ చేయడం కన్నా తీవ్ర నేరం మరొకటి లేదు. ఏకారణంతో అడ్వొకేట్లు, జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. ట్యాపింగ్పై సర్వీస్ ప్రొవైడర్లకు ఏమైనా లిఖిత పూర్వక ఆదేశాలు అందజేశారా? ఫోన్ ట్యాపింగ్ లో రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి. ముద్దాయే సాక్ష్యాలు ఇవ్వాలని అడగటం ఎక్కడైనా ఉందా?’’ అని యనమల ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం