Chandrababu: సీఎం నిర్లక్ష్యం వల్లే అంకుర వ్యవస్థ ధ్వంసం: చంద్రబాబు
సీఎం జగన్ (jagan) నిర్లక్ష్యం వల్లే ఏపీలో అంకుర వ్యవస్థ ధ్వంసమైపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. స్టార్టప్ల అభివృద్ధిలో బిహార్ కంటే ఇప్పుడు ఏపీ దిగువన ఉందని విమర్శించారు
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan) నిర్లక్ష్యం, నిరాసక్తత వల్ల రాష్ట్రంలో అంకుర సంస్థల వ్యవస్థ ధ్వంసమైందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. యువ పారిశ్రామికవేత్తల ఆకాంక్షలను జగన్ ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. ఈ పోటీ ప్రపంచంలో రాష్ట్ర యువత భవిష్యత్ తలచుకుంటే బాధగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 వరకు, దేశంలోనే అత్యధికంగా అంకుర సంస్థలకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా ఉండేదని, స్టార్టప్లు అభివృద్ధి చెందడానికి విశాఖలో అనుకూల వాతావరణాన్ని తీసుకొచ్చామని అన్నారు. తెదేపా ప్రభుత్వం విశాఖలో ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా అంకుర సంస్థల ఏర్పాటుకు ఎంతో కృషి జరిగిందన్నారు. అలాంటిది స్టార్టప్ల అభివృద్ధిలో బిహార్ కంటే ఇప్పుడు ఏపీ దిగువన ఉందని చంద్రబాబు విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vennira Aadai Nirmala: మా ఇంటికి హీరో తాగొచ్చి.. రాద్ధాంతం చేశాడు: సీనియర్ నటి
-
Sports News
Umran - Ishant: బ్యాటర్లు భయపడేలా.. ఇంకా వేగం పెంచు : ఉమ్రాన్కు ఇషాంత్ సలహా
-
World News
Imran Khan: నన్ను కోర్టులోనే చంపేస్తారేమో: ఇమ్రాన్ ఖాన్
-
Movies News
Ramya Krishnan: ఇలాంటి సినిమా ఎవరు చూస్తారని అడిగా: రమ్యకృష్ణ
-
Politics News
Arvind Kejriwal: కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
Crime News
Fake Currency: నకిలీ నోట్ల అడ్డా.. చేనేతపురి!