Amaravati: అంతిమ విజయం దక్కాలి
రాష్ట్ర రాజధాని కోసం, తమ కుటుంబ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తోన్న మహిళలను బూటు కాళ్లతో తన్నించినందుకే రాష్ట్రానికి ఇన్ని ఉపద్రవాలు ఎదురవుతున్నాయని..
తెదేపా అధినేత చంద్రబాబు
అమరావతి: రాష్ట్ర రాజధాని కోసం, తమ కుటుంబ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తోన్న మహిళలను బూటు కాళ్లతో తన్నించినందుకే రాష్ట్రానికి ఇన్ని ఉపద్రవాలు ఎదురవుతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి ఉద్యమం 500 రోజులకు చేరుకున్న నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు.
‘‘ప్రజా రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమం 500 రోజులకు చేరుకుంది. జగన్ తన పాలనతో తీసుకున్న తుగ్లక్ నిర్ణయానికి సుమారు 29వేల మంది రైతులు బాధపడుతూ దీక్షలు చేస్తుంటే ఈ 500 రోజుల్లో ఒక్కసారైనా వారిని కలిసి మాట్లాడలేదు. ఇలాంటి మూర్ఖపు పాలకుడిని చూడటం ఇదే మొదటిసారి. పాలకులు ఎంత నిర్దయగా ప్రవర్తిస్తున్నా.. ప్రజా రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు శాంతియుతంగా, నిరాటంకంగా తమ ఆందోళనను కొనసాగిస్తోన్న రైతులు, రైతు కూలీలు, మహిళలకు అంతిమ విజయం దక్కాలని ఆశిస్తున్నా’’ అని చంద్రబాబు తెలిపారు.
రైతుల త్యాగం నిరుపయోగం కాదు: లోకేశ్
రాజధాని రైతుల త్యాగం నిరుపయోగం కాదని.. అమరావతి శాశ్వతంగా ఉంటుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ప్రజారాజధానిదే అంతిమ విజయమన్నారు. ప్రజలే ముందుకొచ్చి తమ భూముల్ని త్యాగం చేసి ప్రజారాజధాని అమరావతికి పునాదులు వేయడానికి దోహదపడ్డారని లోకేశ్ గుర్తు చేశారు. దేశంలోనే తొలిసారిగా 30వేలమంది అన్నదాతలు స్వచ్ఛందంగా ల్యాండ్పూలింగ్కి సహకరించడంతో నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి విలసిల్లిందన్నారు. రాష్ట్రానికే సంపదలాంటి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమరావతిని కొనసాగించి, అభివృద్ధి చేయాల్సిన జగన్ సర్వనాశనమే లక్ష్యంగా మూడు రాజధానుల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టారని దుయ్యబట్టారు.
నాటి నుంచి ప్రజారాజధాని పరిరక్షణ కోసం నడుం బిగించిన రైతులు, మహిళలు సకల జనులూ శాంతియుతంగా ఉద్యమిస్తున్నారని తెలిపారు. అధికారం అండతో ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసినా ఒక్కరూ వెనక్కి తగ్గలేదని కొనియాడారు. ‘ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని’ అంటూ గొంతెత్తి నినదిస్తూనే వందలాది గుండెలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి పరిరక్షణే లక్ష్యంగా 500 రోజులుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న అన్నదాతలు, మహిళలు, ఉద్యమకారులందరికీ లోకేశ్ ఉద్యమాభివందనాలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?