Chandrababu: ఓటమి భయం అధికార పక్షానికి నిద్ర లేకుండా చేస్తోంది: చంద్రబాబు

రాజకీయంగా తమ కథ ముగిసిందని వైకాపా నేతలకు అర్థమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజకీయ మనుగడ కోసమే వారంతా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. 

Published : 25 Nov 2022 22:05 IST

అమరావతి: రాజకీయంగా తమ కథ ముగిసిందని వైకాపా నేతలకు అర్థమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజకీయ మనుగడ కోసమే వారంతా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.  రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల  ఇంఛార్జ్‌లతో ఆయన శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వాన్ని ఏదీ రక్షించలేదనే వాస్తవాన్ని ఆ పార్టీ నేతలు గుర్తించారన్నారు.  ఓటమి భయం అధికార పక్షానికి నిద్ర లేకుండా చేస్తోందని విమర్శించారు. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం విస్తృత స్థాయిలో జరగాలని పార్టీ నేతలకు సూచించారు. క్షేత్రస్థాయిలో జరిగే కార్యక్రమాన్ని రోజువారీ పర్యవేక్షిస్తానని తెలిపారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో నేతలు వెనకబడితే వారికే నష్టమని చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని