అన్నీ గుర్తు పెట్టుకుంటాం: చంద్రబాబు

తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని.. చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తే

Updated : 13 Jul 2021 15:13 IST

పొన్నూరు: తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని.. చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. వైకాపా అవినీతి నుంచి దృష్టి మరల్చేందుకే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. గుంటూరు జిల్లా చింతలపూడిలో తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను చంద్రబాబు పరామర్శించారు. సంగం డెయిరీ కేసు వ్యవహారంలో అరెస్టయి జైలుకి వెళ్లొచ్చిన నరేంద్ర ఇంటికి తెదేపా అధినేత వెళ్లారు. పార్టీ పూర్తి అండగా ఉంటుందని ఆయనకు చెప్పారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

‘‘ధూళిపాళ్ల నరేంద్రకు ప్రజలు కూడా అండగా నిలవాలి. వైకాపా నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు కూడా సరిపోవు. రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. చట్ట వ్యతిరేకంగా ప్రజల్ని, తెదేపాను ఎలా హింసిస్తున్నారో వాటన్నింటినీ గుర్తు పెట్టుకుంటాం. భవిష్యత్‌లో అన్నింటిపైనా సమీక్షలు చేస్తాం. రాయలసీమలో ముఠాకక్షలపై కఠినంగా వ్యవహరించి ప్రశాంతత తీసుకొచ్చాం. అక్కడ ఇప్పుడు మళ్లీ హత్యారాజకీయాలు ప్రారంభిస్తున్నారు.. ఇది సబబా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని