Andhra News: భగ్గుమన్న అమలాపురం.. ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమే: చంద్రబాబు
కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రశాంతంగా ఉన్న
అమరావతి: కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రశాంతంగా ఉన్న కోనసీమలో ఘర్షణలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. అల్లర్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని తెదేపాపై నెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సున్నిత అంశంలో హోంశాఖ మంత్రి నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు. ఇది ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఆందోళనలో భాజపా శ్రేణులు పొల్గొనరు: సోము వీర్రాజు
అమలాపురం ఘటనను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అమలాపురంలో సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘర్షణలు నిలువరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆందోళనలో భాజపా శ్రేణులు పొల్గొనరని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు