Andhra News: జగన్‌ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది: చంద్రబాబు

తెదేపా పాలనలో రాష్ట్రంలో లక్షల మందికి ఇళ్లు కట్టించామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. సీఎం జగన్‌ మూడేళ్ల పాలనలో ఎక్కడైనా ఒక్క ఇల్లు కట్టారా? అని ప్రశ్నించారు....

Published : 19 May 2022 21:28 IST

నంద్యాల: తెదేపా పాలనలో రాష్ట్రంలో లక్షల మందికి ఇళ్లు కట్టించామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. సీఎం జగన్‌ మూడేళ్ల పాలనలో ఎక్కడైనా ఒక్క ఇల్లు కట్టారా? అని ప్రశ్నించారు. నంద్యాల జిల్లా జలదుర్గంలో నిర్వహించిన రోడ్‌ షోలో చంద్రబాబు మాట్లాడారు. తెదేపా హయాంలో మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతామని పేర్కొన్నారు. జగన్‌ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని