Chandrababu: తెలంగాణలో తెదేపాకు పూర్వ వైభవం వస్తుంది: చంద్రబాబు
తెదేపా వచ్చిన తర్వాతే తెలుగువారి ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పే పరిస్థితి వచ్చిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో ఏదో ఒకరోజు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో తెదేపా అధికారంలో లేకపోయినా పార్టీ శ్రేణుల ఉత్సాహం బాగుందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో పార్టీ శ్రేణులనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.
‘‘ఎన్టీఆర్, పీవీ నరసింహారావు దేశానికి దశ దిశ చూపించారు. తెదేపా వచ్చిన తర్వాతే తెలుగువారి ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పే పరిస్థితి వచ్చింది. తెలంగాణ దేశంలోనే నెంబర్వన్గా నిలుస్తోందంటే తెదేపా వేసిన పునాదే కారణం. తెలుగు వాళ్లు ప్రపంచం నలుమూలలా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఘనతే. ఆనాడు ఐటీ అభివృధ్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైంది. హైదరాబాద్ అభివృద్ధిలో అడుగడుగునా తెదేపా ముద్ర ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగువారి కోసం తెదేపా పనిచేస్తుంది. ప్రతి తెలుగువాడిని సంపన్నుడిని చేయడమే తెదేపా లక్ష్యం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలోని వంద ప్రధాన నగరాల్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయని తెలిపారు. మరోసారి తనను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్భవన్కు వచ్చిన చంద్రబాబుకు రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పలువు సీనియర్ నేతలు ఘన స్వాగతం పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!