Chandrababu: చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది: చంద్రబాబు
నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన తేదేపా 41వ ఆవిర్భావ సభకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్: సంక్షేమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన తెదేపా 41వ ఆవిర్భావ సభకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. అనంతరం భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ‘‘41 సంవత్సరాల క్రితం చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29. అధికారం కావాలని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదు. తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని పార్టీ పెట్టారు. తెలుగుజాతి కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశమని చెప్పారు. తెలుగు జాతి వసుధైక కుటుంబంగా ఉండటం మనందరి అదృష్టం. మానవత్వమే తన సిద్ధాంతమని ఆనాడు ఎన్టీఆర్ చాటి చెప్పారు. ఎన్టీఆర్ తెచ్చిన పాలనా సంస్కరణలు చరిత్రలో ఎక్కడా లేవు. సంక్షేమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం. సంస్కరణలకు మారు పేరు ఎన్టీఆర్. చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశంపార్టీ ఉంటుంది. తెదేపాకు ముందు.. తర్వాత అని తెలుగుజాతి గురించి మాట్లాడే పరిస్థితి’’ అని చంద్రబాబు వివరించారు.
అధికారంలోకి వస్తాం.. అభివృద్ధిలోకి తెస్తాం
‘‘హైదరాబాద్కు దీటుగా అమరావతి నిర్మాణం చేపట్టాం. అమరావతి కోసం రైతులు 33వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. విభజన కంటే జగన్ వల్ల ఎక్కువ నష్టం జరిగింది. సైకో అనాలా? దద్దమ్మ అనాలా? చేతకాని వ్యక్తి అనాలా? రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టాడు అనాలో అర్థం కావడం లేదు. ఏపీలో పరిస్థితి చూస్తే బాధేస్తోంది. 30 ఏళ్లు అభివృద్ధి వెనక్కి వెళ్లింది. పులివెందులలో తుపాకీ సంస్కృతి వచ్చింది. మొన్న గొడ్డలి.. ఇప్పుడు తుపాకీ.. గంజాయి సంస్కృతి వచ్చింది. తెలుగుదేశం చారిత్రక అవసరం తెలుగువారందరికీ ఉంది. రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. గ్రాడ్యుయేట్స్లో తిరుగుబాటుకు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. మళ్లీ ఏపీలో అధికారంలోకి వస్తాం.. రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తెస్తాం.
మీ జీవితాన్ని మార్చేది రాజకీయాలే..
తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి. తెలంగాణకు తెలుగుదేశం అవసరం ఉంది. తెలుగు జాతిని గ్లోబల్ లీడర్స్గా తయారు చేయాలన్న సంకల్పం తీసుకుంటున్నా. 2047 నాటికి ప్రపంచంలోనే పవర్ఫుల్ కమ్యూనిటీగా తెలుగువారు ఉండాలని, అందుకోసం కృషి చేయాలనేది నా సంకల్పం. 12శాతం జనాభా రోజుకు రూ.150 అర్జిస్తుండటం బాధగా ఉంది. ఒకశాతం జనాభా 62శాతం సంపద అనుభవించే పరిస్థితి వచ్చింది. అందరూ కలిసి నిరుపేదలకు అండగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మరొకరికి సహకరించాలి. పేదలను దత్తత తీసుకోవాలి. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నాంది పలుకుతాం. సంపద సృష్టించి పేదలకు పంచడం తెదేపాకు తెలుసు. పేదవాడిని కోటీశ్వరుడిని చేసే బాధ్యత సమాజానిది. అందుకోసం ప్రణాళిక తయారు చేస్తా.. ఉక్కు సంకల్పంతో చేసి చూపిస్తాం. చాలా మంది రాజకీయాలు మనకెందుకు అనుకుంటారు. కానీ, మీ జీవితాన్ని మార్చేది రాజకీయాలే. జగన్ మాదిరి దొంగలు వస్తే రాష్ట్రానికి ఏం చేస్తారు? సుపరిపాలనకు నాంది పలికిన పార్టీకి సహకరించాలి. ప్రజలతో పార్టీ నడపాలనేది నా సంకల్పం. మంచి వారిని ప్రోత్సహిస్తే సమాజానికి మంచి జరుగుతుంది’’ అని చంద్రబాబు అన్నారు.
తెలుగు జాతికి పండుగ రోజు: అచ్చెన్నాయుడు
‘‘యావత్ తెలుగు జాతికి ఇవాళ పండుగ రోజు. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు తెదేపా హయాంలోనే అభివృద్ధి జరిగింది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత తెలుగు జాతి చరిత్ర మారింది. పసుపు జెండా అంటే ఆత్మగౌరవమని గుర్తించాలి. ఎన్టీఆర్ వచ్చాక తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చింది. హైదరాబాద్ సిటీ విదేశాలతో పోటీ పడటానికి కారణం చంద్రబాబు. ఏపీకి ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రుల దురదృష్టకరం. చంద్రబాబును మళ్లీ సీఎం చేయడానికి ఏపీలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జగన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. రాష్ట్రం విడిపోయినా తెలుగువారు అభివృద్ధి చెందాలనేదే చంద్రబాబు అభిమతం’’ అని అచ్చెన్నాయుడు అన్నారు. తెదేపా తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, తెదేపా అండమాన్ అధ్యక్షుడు మాణిక్రావు యాదవ్, నందమూరి బాలకృష్ణ, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేతలు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Tamilisai: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. -
Nara Lokesh: అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణ పనులు: నారా లోకేశ్
వైకాపా హయాంలో ఆగిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. -
ప్రధాని పర్యటనలో పోలీసుల తీరుపై సీఈసీకి ఫిర్యాదు చేయనున్న కూటమి నేతలు
ప్రజాగళం సభకు పోలీసులు అడుగడుగునా అనేక అవరోధాలు సృష్టించడం, ప్రధాని మోదీ పాల్గొంటున్న సభ అయినా బేఖాతరుగా వ్యవహరించడం, సహాయనిరాకరణ వంటివన్నీ సభను విఫలం చేసేందుకు పన్నిన కుట్రలో భాగమని తెదేపా, జనసేన, భాజపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
Gudivada Amarnath: గాజువాకలో అమర్నాథ్కు ఝలక్
విశాఖ జిల్లా గాజువాక వైకాపా అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న మంత్రి అమర్నాథ్కు పార్టీశ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆదివారం ఆయన గాజువాకలో తొలిసారిగా పార్టీశ్రేణులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. -
జగన్ సీఎం కాదు.. సారా వ్యాపారి
తిరుపతి బాలాజీ ఆశీస్సులతో 2014లో ఎన్డీయే విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని స్థాపించింది. 2024లో దుర్గమ్మ ఆశీస్సులతో మళ్లీ మొదలుపెడుతున్నాం. అంతకుమించిన ఘన విజయాన్ని సాధిస్తున్నాం. ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. -
జెండాలు వేరైనా.. ఎజెండా ఒక్కటే
‘వికసిత భారత్ కోసం ఇదే సమయం. సరైన సమయం’ అనేది నరేంద్రమోదీ నినాదం. దేశానికి సరైన సమయంలో మోదీ లాంటి సరైన నాయకుడు దొరికారు. ఆ దిశగా మీ ప్రతి ప్రయత్నంలో మేము మీతో ఉంటామని మాటిస్తున్నాం. -
‘ప్రజాగళం’ సభలో ఎవరేమన్నారంటే..
అయిదేళ్లుగా సీఎం జగన్ మీద, ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో మనకు తెలుసు. రాష్ట్రంలో అరాచక పాలనను అంతం చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. 56 రోజుల కౌంట్డౌన్ మొదలైంది. తెదేపా, జనసేన, భాజపా కూటమికి అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలు చూస్తున్నారు. -
జగన్ మీ దత్తపుత్రుడు కాదా?
ముఖ్యమంత్రి జగన్తో అయిదేళ్లుగా అంట కాగుతూ కాంగ్రెస్ వైకాపా ఒకటేనని ప్రధాన మోదీ ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. -
అన్ని స్థానాలకు పోటీ చేస్తాం
బహుజనులకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించి రాజ్యాధికారంలో వారిని భాగస్వాములను చేసే దిశగా బీఎస్పీ అడుగులు వేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి.పరంజ్యోతి తెలిపారు. -
అగమ్యగోచరంగా భారాస పరిస్థితి: మల్లురవి
భారాస లక్క ఇల్లు లాంటిదని, ఓటమి మంటల్లో చిక్కుకొని కాలిపోతుండడంతో ఆ పార్టీ నాయకులు బయటపడుతున్నారని దిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి అన్నారు. -
మిగతా అభ్యర్థుల ఖరారుకు కాంగ్రెస్ కసరత్తు
లోక్సభ ఎన్నికల్లో ఇంకా ప్రకటించాల్సిన అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ‘కేంద్ర ఎన్నికల కమిటీ’ (సీఈసీ) మంగళ, బుధవారాల్లో సమావేశమయ్యే అవకాశం ఉంది. -
దానంపై ఫిర్యాదుకు స్పీకర్ ఇంటికి భారాస ఎమ్మెల్యేలు..
భారాస పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు వినతిపత్రం అందజేయాలని భారాస ఎమ్మెల్యేలు నిర్ణయించారు. -
సీఎం రేవంత్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి: దాసోజు శ్రవణ్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకుండా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని భారాస నేత దాసోజు శ్రవణ్ తెలిపారు. -
తెలంగాణకు భాజపా ఏం చేసిందని ఓట్లేయాలి?
గత పదేళ్లలో తెలంగాణకు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో కిషన్రెడ్డి చెప్పాలని, ప్రజలు ఎందుకు ఓట్లేయాలని భారాస నేత రావుల శ్రీధర్రెడ్డి ప్రశ్నించారు. -
కేసీఆర్, ఒవైసీలకు రజాకార్ సినిమా చూపించాలి
కేసీఆర్, ఒవైసీ వంటి నేతలందరికీ ‘రజాకార్’ సినిమా చూపించాలని, నిజాం చేసిన అరాచకాలు వాళ్లకు తెలియాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. -
ఈవీఎం, ఈడీలతోనే మోదీ గెలుపు
భారత్ జోడో యాత్రతో సామాన్యుడి సమస్యలైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, సమాజంలో విద్వేష భావన వంటివి వెలుగులోకి వచ్చాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలిపారు. -
మేనిఫెస్టో ఖరారుపై రేపు సీడబ్ల్యూసీ భేటీ
లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను ఖరారు చేయడానికి ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ’ (సీడబ్ల్యూసీ) మంగళవారం భేటీ కానుంది. -
రెండ్రోజుల ముందే అరుణాచల్, సిక్కిం ఓట్ల లెక్కింపు
అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది. ముందు ప్రకటించిన ప్రకారమైతే లోక్సభ ఎన్నికల ఓట్లతో పాటు ఈ రాష్ట్రాలకు సంబంధించిన లెక్కింపు జూన్ 4న జరగాల్సి ఉంది. -
సార్వత్రికం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి
లోక్సభ ఎన్నికలు ముగిసిన నెల తర్వాత జమ్మూ-కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ ఛైర్మన్ గులాం నబీ ఆజాద్ ఆదివారం ఎన్నికల కమిషన్(ఈసీ)ని అభ్యర్థించారు. -
నేడు భారాసలోకి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
విశ్రాంత ఐపీఎస్ అధికారి, బీఎస్పీ మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం భారాసలో చేరనున్నారు. -
జగన్ సర్కారును పెకలించేేద్దాం
రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయిన జగన్ సర్కారును పెకలించి వేసేందుకు, కేంద్రంలో మళ్లీ ఎన్డీయే సర్కారును తెచ్చేందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంకల్పం తీసుకున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
Electoral Bonds: ఎన్నికల బాండ్ల నంబర్లూ చెప్పాల్సిందే.. ఎస్బీఐకి సుప్రీం డెడ్లైన్
-
Appsc: గ్రూప్-1 మెయిన్స్ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అప్పీల్
-
Electoral Bonds: నా విరాళాలు వారికిచ్చాను.. ఎన్నికల బాండ్లపై కిరణ్ మజుందార్ షా
-
Tharun Bhascker: ఎస్పీ చరణ్తో వివాదం.. తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే
-
S Jaishankar: ‘స్నేహమంటే అదే కదా’: నేవీ ఆపరేషన్పై జై శంకర్ ఆసక్తికర రిప్లై
-
WPL 2024: ఈ కప్ వారి కోసమే.. మాటలు రావడం లేదు: స్మృతి మంధాన