Chandrababu: ఏలూరు జిల్లా పర్యటనకు చంద్రబాబు.. కలపర్రు టోల్గేట్ వద్ద ఘనస్వాగతం
తెదేపా అధినేత చంద్రబాబు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో పెదవేగి మండలం విజయరాయిలో ‘ఇదేమి ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఏలూరు: తెదేపా అధినేత చంద్రబాబు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో పెదవేగి మండలం విజయరాయిలో ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా కలపర్రు టోల్గేట్ వద్ద చంద్రబాబుకు తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి భారీ గజమాలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం తెదేపా శ్రేణులు ద్విచక్ర వాహన ర్యాలీతో జానంపేట మీదుగా విజయరాయి చేరుకున్నారు.
నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో రోడ్డు షోలు నిర్వహించనున్నారు. విజయరాయిలో ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమం ప్రారంభించి అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30కు బయలుదేరి 3 గంటలకు వలసపల్లి అడ్డరోడ్డు వద్దకు చేరుకుంటారు. ధర్మాజీగూడెం, మఠంగూడెం, లింగపాలెం గ్రామాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు చింతలపూడిలోని భారత్ పెట్రోలు బంకు వద్ద నుంచి రోడ్డు షో ప్రారంభిస్తారు. బోసు బొమ్మ కూడలిలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వైకాపా ప్రభుత్వ తీరుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోరాడేందుకు తెదేపా శ్రేణులను చంద్రబాబు సమాయత్తం చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం
-
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM