Mulayam Singh Yadav: ములాయం భౌతికకాయానికి నివాళులర్పించిన చంద్రబాబు

అనారోగ్యంతో మృతిచెందిన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ భౌతికకాయం వద్ద తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు...

Updated : 11 Oct 2022 15:06 IST

లఖ్‌నవూ: అనారోగ్యంతో కన్నుమూసిన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ భౌతికకాయం వద్ద తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. పార్టీ ఎంపీలు, నేతలతో కలిసి ములాయం స్వస్థలం సైఫాయ్‌ వెళ్లారు. ములాయం పార్థివదేహం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ములాయం అంత్యక్రియల అనంతరం చంద్రబాబుతో పాటు తెదేపా ఎంపీలు సాయంత్రం తిరిగి ఏపీకి రానున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని