Chandrababu: శ్రీలంక ప్రజల కంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువ: చంద్రబాబు

శ్రీలంక ప్రజల కంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అందుకే ఇంకా వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు చేయలేదని వ్యాఖ్యానించారు..

Updated : 21 Jul 2022 14:05 IST

ఆచంట: శ్రీలంక ప్రజల కంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అందుకే ఇంకా వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు చేయలేదని వ్యాఖ్యానించారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లారు. ఆచంట నియోజకవర్గం ఇలపర్రు వద్ద స్థానికులు చంద్రబాబు కాన్వాయ్‌ను ఆపడంతో అక్కడ ఆయన మాట్లాడారు.

దేశంలో అధిక ధరలకు చిరునామా ఆంధ్రప్రదేశ్‌ అని.. అత్యధిక అప్పులు చేసింది కూడా ఏపీయే అని చంద్రబాబు విమర్శించారు. బాదుడే బాదుడుతో ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. పోలవరాన్ని రివర్స్‌ గేర్‌లో వెనక్కి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. అంతకుముందు పెనుగొండ మండలం నశిపూడిలో చంద్రబాబు పర్యటించారు. అక్కడ వరద బాధితుల సమస్యలు తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని