BJP: జేపీ నడ్డా తెలంగాణ పర్యటనలో మార్పులు..

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేదర్‌రెడ్డి తెలిపారు.

Published : 30 Mar 2023 22:23 IST

హైదరాబాద్‌: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేదర్‌రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని దిల్లీ నుంచి జేపీ నడ్డా వర్చువల్‌గా ప్రారంభిస్తారని, అనంతరం కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, శివప్రకాశ్‌, తరుణుచుగ్‌, సునీల్‌ బన్సల్‌ హాజరవుతారని తెలిపారు.  సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్ల నేతల సమావేశం యధావిధిగా కొనసాగుతుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని