నేను మరణించైనా కాపు రిజర్వేషన్లు సాధిస్తా: మాజీ ఎంపీ హరిరామజోగయ్య
కాపు రిజర్వేషన్ల సాధనకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం నిరాహార దీక్ష చేపడతానని మాజీ ఎంపీ హరిరామజోగయ్య వెల్లడించారు.
పాలకొల్లు: తాను మరణించైనా కాపులకు రిజర్వేషన్లు సాధిస్తానని మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామజోగయ్య అన్నారు. కాపులకు 5% రిజర్వేషన్ కల్పించే విషయంలో డిసెంబర్ 31లోపు స్పష్టత ఇవ్వాలని ఇటీవల ఏపీ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ గడువు ముగిసిన నేపథ్యంలో హరిరామజోగయ్య ఓ ప్రకటన విడుదల చేశారు.
కాపు రిజర్వేషన్ల సాధనకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం నిరాహార దీక్ష చేపడతానని హరిరామ జోగయ్య వెల్లడించారు. నిరాహారదీక్షకు అనుమతి కోరితే పోలీసులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. తాను చేపట్టే దీక్షను భగ్నం చేసినా.. ఎక్కడికి తరలిస్తే అక్కడ కొనసాగిస్తానని ఆయన తేల్చి చెప్పారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం నుంచి స్పందన రానందునే నిరాహారదీక్షకు దిగుతున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా