Goa Election 2022: ‘చిదంబరం సర్..మీ ఓట్లు పోయాయనే ఏడుపు ఆపండి’
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది గోవాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం.. గోవా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కాంగ్రెస్, భాజపాల మధ్యే ప్రధాన పోటీ ఉందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), టీఎంసీలు కేవలం భాజపాయేతర...
పనాజీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గోవాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం.. గోవా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కాంగ్రెస్, భాజపాల మధ్యే ప్రధాన పోటీ ఉందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), టీఎంసీలు కేవలం భాజపాయేతర ఓట్లను మాత్రమే చీల్చుతాయన్న తన అంచనాను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం ధ్రువీకరించారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఒకవేళ గోవాలో హంగ్ ఏర్పడితే.. సంకీర్ణ ప్రభుత్వంలో భాగమయ్యేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని ఉద్దేశిస్తూ.. సోమవారం చిదంబరం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
గోవా ఎన్నికలకు కాంగ్రెస్ సీనియర్ ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న చిదంబరం.. పాలనలో మార్పు కోసం కాంగ్రెస్ను ఎన్నుకోవాలని రాష్ట్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. మరోవైపు చిదంబరం వ్యాఖ్యలపై కేజ్రీవాల్ ఎదురుదాడికి దిగారు. ‘సర్.. మీ ఓట్లు పోయాయనే ఏడుపు ఆపండి’ అని ట్వీట్ చేశారు. ‘గోవావాసులకు ఎవరిమీదైతే నమ్మకం ఉందో వారికే ఓటేస్తారు. కాంగ్రెస్ కేవలం భాజపాకు మాత్రమే ఆశాకిరణం.. గోవావాసులకు కాదు. మీ 17 మంది ఎమ్మెల్యేల్లో 15 మంది భాజపాకు మారారు’ అని చిదంబరం ట్వీట్లను ట్యాగ్ చేస్తూ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు! కాంగ్రెస్కు వేసిన ప్రతి ఓటు భాజపాకు భద్రంగా చేరుతుందని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఆప్ తొలిసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గోవాలోని మొత్తం 40 స్థానాలకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!