Bihar politics: నీతీశ్పై మండిపడిన చిరాగ్.. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్
భాజపా-జేడీ(యూ) బంధం తెగిపోవడంతో బిహార్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి .....
పట్నా: భాజపా-జేడీ(యూ) బంధం తెగిపోవడంతో బిహార్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి నీతీశ్ కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్కు అందజేసిన తర్వాత ఆయన నేరుగా ఆర్జేడీ చీఫ్ లాలూ నివాసానికి వెళ్లి తేజస్వీ యాదవ్తో భేటీ అయ్యారు. ఆర్జేడీ, కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా జోరుగా పావులు కదుపుతున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలపై లోక్జనశక్తి పార్టీ (రాం విలాస్ వర్గం) నేత చిరాగ్ పాసవాన్ స్పందించారు. ఆర్జేడీతో నీతీశ్ చేతులు కలపడంపై మండిపడ్డారు. బిహార్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. నీతీశ్ విశ్వసనీయత కోల్పోయారని.. వచ్చే ఎన్నికల్లో జేడీ(యూ)కి సున్నా సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. పట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈరోజు నీతీశ్ విశ్వసనీయత సున్నా. బిహార్లో రాష్ట్రపతి పాలన విధించాలి. కొత్తగా ప్రజా తీర్పు కోరాలి. నీతీశ్.. మీకు ఏమైనా సిద్ధాంతం ఉందా లేదా? వచ్చే ఎన్నికల్లో జేడీ(యూ)కి సున్నా సీట్లే వస్తాయి’’ అని వ్యాఖ్యానించారు.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ) ఓటమే లక్ష్యంగా అభ్యర్థులను నిలిపిన లోక్జనశక్తి అధ్యక్షుడు చిరాగ్కు భాజపా పెద్దల ఆశీర్వాదం ఉందని నీతీశ్ బలంగా విశ్వసిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పట్నాలో భాజపా సమావేశంలో చిరాగ్ ప్రత్యక్షం కావడం వంటి కారణాలు కమలనాథుల వ్యూహాలపై నీతీశ్లో అనుమానాలు రేకెత్తడం కూడా భాజపా-జేడీయూ బంధానికి బీటలు రావడానికి కారణాలుగా విశ్లేషణలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్