Arvind Kejriwal: ‘ఐబీ నివేదిక ప్రకారం.. గుజరాత్లో ఆప్దే విజయం!’
ఇప్పటికిప్పుడు గుజరాత్లో ఎన్నికలు పెడితే వచ్చేది ఆప్ ప్రభుత్వమేనని పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇదే విషయాన్ని తెలియజేస్తోందని చెప్పారు...
గాంధీనగర్: ఇప్పటికిప్పుడు గుజరాత్(Gujarat)లో ఎన్నికలు పెడితే వచ్చేది ఆప్(AAP) ప్రభుత్వమేనని పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక(IB Report) ఇదే విషయాన్ని తెలియజేస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో.. ఆప్ ఓట్లను చీల్చేందుకు భాజపా(BJP), కాంగ్రెస్లు ఒక్కటయ్యాయని ఆరోపించారు. ‘ఐబీ నివేదికతో భాజపా కుంగిపోయింది. దీంతో కాంగ్రెస్(Congress), భాజపాలు రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. భాజపా వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఆ పార్టీ నేతలు.. కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి యత్నిస్తున్నారు. ఆప్ ఓట్లను కొల్లగొట్టే బాధ్యత కాంగ్రెస్కు అప్పగించారు’ అని ఆదివారం రాజ్కోట్లో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ 10 సీట్లకు మించి గెలవదని.. విజయం సాధించిన వారూ భాజపాలో చేరతారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘కాంగ్రెస్కు ఓటు వేయడం వృథా. భాజపా పాలనతో విసిగిపోయిన వారందరూ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయండి. దిల్లీ, పంజాబ్ రికార్డులను బద్దలు కొట్టండి’ అని రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు. స్వల్ప మెజారిటీతో ఆప్ గెలుస్తుందని ఐబీ రిపోర్టులో ఉందని చెబుతూ.. దీన్ని మరింత పెంచేలా పెద్దఎత్తున మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆవుల పోషణకు రోజుకు రూ.40 చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు.. రోడ్లపై తిరిగే, పాలు ఇవ్వని ఆవుల కోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సంరక్షణ కేంద్రాలు నిర్మిస్తామని తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్