YSRCP: నంద్యాలలో తారస్థాయికి చేరిన వైకాపా విభేదాలు
నంద్యాల జిల్లాలో అధికార వైకాపా నాయకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. నంద్యాల ఎమ్మెల్యే
నంద్యాల: నంద్యాల జిల్లాలో అధికార వైకాపా నాయకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, వైకాపాకు చెందిన మరో నేత మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు.
నంద్యాలలో పోలీస్ కానిస్టేబుల్ సురేంద్రను హత్య చేసిన నిందితులను కడప కేంద్ర కారాగారానికి వెళ్లి ఎమ్మెల్యే రవిచంద్ర పరామర్శించినట్లు రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తాను వెళ్లినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని..లేదంటే రాజగోపాల్రెడ్డి తప్పుకోవాలని ఎమ్మెల్యే శిల్పా సవాల్ విసిరారు. తాజాగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎలాంటి ఆధారాలు చూపించినా అధికార దర్పంతో ఎమ్మెల్యే అవాస్తవం అని తేలుస్తారని అన్నారు. నంద్యాలలోని రౌడీ మూకలకు ఎమ్మెల్యే అండగా నిలబడుతున్నారని ఆరోపించారు. నంద్యాల పరిధిలో గత మూడేళ్ళలో 15 నుంచి 20 హత్యలు జరిగాయని.. శాంతి భద్రతలు లోపించడానికి ఎమ్మెల్యేనే కారణమని అన్నారు. పోలీసు కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసును సీబీఐకి అప్పజెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే హైకోర్టులో రిట్ వేస్తామని అన్నారు. ఈ విషయాన్ని ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెల్దామా? అని అన్నారు. నంద్యాలలో శాంతిభద్రతల కాపాడలేకపోతే ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి రాజీనామా చేయాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?