Telangana News: 7 మండలాలను తిరిగి తెచ్చుకునేందుకు ఏం చేస్తారు?: భట్టి విక్రమార్క
వరద బాధితులకు వెంటనే న్యాయం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.
హైదరాబాద్: వరద బాధితులకు వెంటనే న్యాయం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రాజెక్టులను నిపుణులైన ఇంజినీర్లు డిజైన్ చేస్తేనే బాగుంటుందని.. అవగాహన లేని నేతలు డిజైన్ చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని దుయ్యబట్టారు. సీఎల్పీ కార్యాలయంలో భట్టి మీడియాతో మాట్లాడారు.
‘‘రీడిజైనింగ్లో పొరపాట్లు ఉన్నాయని 2014 నుంచి చెప్తున్నాం. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే అందరికీ మంచిదని చెప్పాం. అవగాహన లేకుండా రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి నిరుపయోగం చేశారు. బ్యాక్ వాటర్తో కాళేశ్వరం పంప్హౌస్లు మునిగిపోయాయి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు మరో 3 మీటర్లు పెంచుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఏపీ ప్రభుత్వ చర్యను తెరాస ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవట్లేదు. 7 మండలాలను తిరిగి తెచ్చుకునేందుకు ఏం చేస్తారో చెప్పాలి’’ అని భట్టి డిమాండ్ చేశారు.
‘‘కాంగ్రెస్ డిజైన్ చేసిన ప్రాజెక్టును నిర్మాణం చేయకుండా రీ-డిజైన్ పేరుతో రూ.కోట్లు వృథా చేశారు. 7 మండలాలు ఏపీలో విలీనం చేస్తే ఖమ్మం జిల్లాకు జరిగే నష్టాన్ని ఆనాడు సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లాం. వాటిని ఏపీలో కలపడానికి మేం ఒప్పుకోమని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాం. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపారా లేదా? తెలంగాణపై ప్రేమ ఉంటే ఇంత జరిగే వరకు చూస్తూ ఊరుకోరు. పోలవరం ఎత్తు పెంచుతుంటే అధికారంలో ఉండి ఏం చేస్తున్నారు? రోజూ గూగుల్ మ్యాప్లో ప్రాజెక్టులను చూసే ముఖ్యమంత్రి పోలవరం ఎత్తు పెంచుతుంటే ఎందుకు అడ్డుకోలేదు? 7 మండలాలపై అసెంబ్లీలో చేసిన తీర్మానానికి న్యాయం చేయాల్సిన బాధ్యత సీఎంపై ఉంది.
కరకట్ట కట్టాలని వైఎస్ఆర్ ఉన్నప్పుడే నిధులు విడుదల చేశారు. తెరాస వచ్చాక వాటిని రద్దు చేసింది. బిల్లులో లేని వాటికి ఆర్డినెన్స్ తెచ్చి 7 మండలాలను ఏపీలో కలిపారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం 3వేల ఎకరాలకే ఒప్పుకోలేదు. అలాంటిది 2లక్షల ఎకరాలు పోతుంటే కేసీఆర్ ఎలా ఒప్పుకున్నారు?వరద రావడంపై విచారణ చేయాల్సిన భాద్యత ప్రభుత్వంపైన ఉంది. ప్రజలను వరదల నుంచి దృష్టి మరల్చేందుకే క్లౌడ్ బరస్ట్ అంటూ సీఎం వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్పై ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరుగుతున్నా ప్రభుత్వం నిద్రపోతోంది’’ అని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల తర్వాత రుణమాఫీ అంటే నమ్మేదెవరు?
ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల వడ్లకు రూ.14 వేల బోనస్ ఇవ్వాలని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
భాజపా, కాంగ్రెస్లకు ఓట్లు అడిగే హక్కు లేదు
త లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని భాజపా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్లకు ఇప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. -
ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.. ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యేలపై కేసుల నమోదు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు ఓ ఎంపీ అభ్యర్థిపై కేసులు నమోదయ్యాయి. -
కలిసి పనిచేయడానికి అంగీకారం
పార్లమెంటు ఎన్నికల్లో సీపీఎం, కాంగ్రెస్ కలిసి పనిచేయాలనే అంగీకారానికి వచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. -
భాజపా ఓటమే సీపీఎం లక్ష్యం: బీవీ రాఘవులు
మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మారుస్తామంటున్న భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. -
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్: కేటీఆర్
అన్నివర్గాల ప్రజలకు, యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కపటనీతికి మారు పేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. -
కాంగ్రెస్లోకి మరో భారాస ఎమ్మెల్యే!
మరో భారాస ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి రాజకీయ పార్టీల మధ్య ఒకవైపు వాదోపవాదాలు జరుగుతుండగా, మరోవైపు రాజేంద్రనగర్ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సంక్షిప్త వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం