ఇకపై కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు: భట్టి

తెలంగాణ గురించి మాట్లాడే హక్కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రోడ్ల మీద పడి అరిచినంత మాత్రాన తెలంగాణ రాలేదని..

Published : 14 Feb 2021 01:37 IST

జగిత్యాల: తెలంగాణ గురించి మాట్లాడే హక్కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రోడ్ల మీద పడి అరిచినంత మాత్రాన తెలంగాణ రాలేదని.. చట్టసభల్లో కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందనే విషయాన్ని వారు మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాలలో నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో తెరాసపై తనదైన శైలిలో భట్టి విమర్శలు చేశారు. తెలంగాణపై మాట్లాడే హక్కు కేవలం కాంగ్రెస్‌ పార్టీకే ఉందన్నారు. నిత్యం అబద్ధాలాడుతూ ప్రజలను దోచుకుంటున్నారని.. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేశారని మండిపడ్డారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని భట్టి హెచ్చరించారు. 2024లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని భట్టి వెల్లడించారు.

ఇవీ చదవండి..

మదనపల్లెలో ఉద్రిక్తం.. నిలిచిన కౌంటింగ్‌

దాంపత్య జీవితానికి అడ్డు వస్తోందని...!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని