Telangana News: కాళేశ్వరం బయల్దేరిన కాంగ్రెస్‌ నేతలు అరెస్టు: మణుగూరు వద్ద ఉద్రిక్తత

భద్రాచలం పర్యటన ముగించుకొని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరిన సీఎల్పీ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బూర్గంపాడు మండలం సారపాక మణుగూరు క్రాస్ రోడ్డు వద్దకు...

Published : 16 Aug 2022 21:42 IST

బూర్గంపాడు: భద్రాచలం పర్యటన ముగించుకొని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరిన సీఎల్పీ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బూర్గంపాడు మండలం సారపాక మణుగూరు క్రాస్ రోడ్డు వద్దకు రాగానే పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్‌ నేతలు భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, బలరాం నాయక్‌, వీరయ్య, సీతక్క తదితరులు రోడ్డుపైనే బైఠాయించారు. ప్రాజెక్టుల సందర్శనకు అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల దౌర్జన్యం నశించాలి, సీఎం కేసీఆర్‌ డౌన్‌ డౌన్‌ అంటూ కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాదాపు రెండు గంటల పాటు కాంగ్రెస్‌ నేతలు, పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో పోలీసులు.. కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు