Jagan-Chandrababu: నంబూరుకు జగన్‌.. చంద్రబాబు పర్యటనపై సందిగ్ధత

ఏపీ సీఎం జగన్‌ గురువారం సాయంత్రం నంబూరులోని మదర్సాలో ఏర్పాటు చేసిన తాత్కాలిక హజ్ హౌస్‌కు రానున్నారు. అయితే, తెదేపా అధినేత చంద్రబాబు కూడా ఇక్కడికి వస్తున్నట్లు షెడ్యూల్‌ ఖరారు చేశారు.

Updated : 08 Jun 2023 15:12 IST

నంబూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం సాయంత్రం 5గంటలకు గుంటూరు జిల్లాలోని నంబూరుకు రానున్నారు. ఇక్కడి మదర్సాలోని తాత్కాలిక హజ్‌ హౌస్‌ వద్దకు ఆయన వెళ్లనున్నారు. అయితే, తెదేపా అధినేత చంద్రబాబు కూడా సాయంత్రం మదర్సాకు రావాలని భావించారు. ఈ మేరకు సాయంత్రం 5.30గంటలకు చంద్రబాబు వస్తున్నట్లు షెడ్యూల్‌ కూడా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ పర్యటన దృష్ట్యా చంద్రబాబు పర్యటనకు అనుమతిపై సందిగ్ధత నెలకొంది.

ప్రతి ముస్లిం తన జీవితంలో కచ్చితంగా అనుసరించాల్సిన ఐదు నియమాల్లో హజ్‌ యాత్ర ఒకటి. ఇస్లాం ధర్మంలో ఒకసారి హజ్‌ వెళ్లడం తప్పనిసరి. బక్రీద్‌ నెలలో చేసే యాత్ర హజ్‌ అని, సాధారణ రోజుల్లో చేసే యాత్ర ఉమ్రా అని పిలుస్తారు. ఈ ఏడాది హజ్‌ యాత్రకు రాష్ట్రం నుంచి 2,000 మందికిపైగా వెళ్తున్నారు. తొలిసారి గన్నవరం విమానాశ్రయం నుంచి ముస్లిం సోదరులు వెళ్లనున్నారు. యాత్ర చేయబోయే అందరికీ పెదకాకాని మండలంలోని నంబూరు మదర్సాలో వసతి ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని